ఎన్టీఆర్ త‌ర్వాత మ‌హేశ్ మాత్ర‌మే చేస్తున్నాడు!!

  • IndiaGlitz, [Saturday,May 30 2020]

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌తో ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. కొత్త‌ద‌నంతో నిండిన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు కూడా ఆద‌రిస్తున్నారు. అందుక‌నే స్టార్ హీరోలంద‌రూ వైవిధ్య‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్పుడు మ‌హేశ్ 27 విష‌యంలోనూ అలాంటి వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇంత‌కూ ఆ న్యూస్ ఏంటో తెలుసా? మ‌హేశ్ త్రిపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడ‌ని.. వివ‌రాల్లోకెళ్తే.. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న త‌న‌ 27వ సినిమాలో మ‌హేశ్ మూడు పాత్ర‌లతో మెప్పిస్తాడ‌ని టాక్‌. అందుక‌నే రీసెంట్‌గా విడుద‌లైన మ‌హేవ్ ఫొటోల్లో ఆ వేరియేష‌న్ క‌న‌ప‌డింద‌ని అంటున్నారు. యంగ్ లుక్‌, యువ‌కుడిగా, మ‌ధ్య వ‌య‌స్కుడి పాత్ర‌లో మ‌హేశ్ క‌నిపిస్తార‌ని టాక్‌.

ఆదివారం మ‌హేశ్ 27వ చిత్రం ఓపెనింగ్ చాలా సింపుల్‌గా జ‌రుగుతుంద‌ని అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ కార‌ణంగా ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. రేప‌టికి సినిమా యూనిట్ వివ‌రాల‌తో పాటు టైటిల్‌ను విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు. ఈ చిత్రానికి స‌ర్కార్ వారి పాట అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇండియన్ బ్యాంకుల‌ను మోసం చేసి విదేశాల‌కు పారిపోయిన ధ‌న‌వంతుల నుండి హీరో ఎలా డ‌బ్బుల‌ను రాబ‌ట్టాడ‌నేదే అస‌లు క‌థ అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి 3వ వర్ధంతి

దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి 3వ వర్ధంతి సందర్భంగా ఫిలింఛాంబర్ లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన హీరో శ్రీకాంత్, నిర్మాత సి.కళ్యాణ్, దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ, దర్శకులు రేలంగి

నన్ను ద్వేషించే వారికి ధ‌న్య‌వాదాలు: స‌మంత‌

అక్కినేని వారి కోడ‌లు స‌మంత అక్కినేని లాక్‌డౌన్ వ‌ల్ల ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్‌లోనే ఉంటూ వ‌చ్చారు.

రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించిన 'వాళ్లిద్దరి మధ్య' లిరికల్ వీడియో సాంగ్

వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించిన చిత్రం "వాళ్ళిద్దరి మధ్య ". విరాజ్ అశ్విన్, నేహాకృష్ణ ఇందులో హీరో హీరోయిన్లు.

రామ్ చరణ్ ను డైరెక్ట్ చేయనున్న యువ దర్శకుడు?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ త‌దుప‌రి సినిమా ఎంట‌నే దానిపై అందరిలో గ‌త కొన్ని రోజులుగా మెదులుతున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో

బాల‌య్య టైటిల్‌ అభిమానులకు న‌చ్చుతుందా?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.