Agnipath protest: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళన హింసాత్మకం.. పోలీసుల కాల్పులు, ఒకరి మృతి

  • IndiaGlitz, [Friday,June 17 2022]

సాయుధ బలగాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా యువత, ప్రజా సంఘాలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. నిన్న ఉత్తరాదిలో జరిగిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇది తెలంగాణకు పాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఆందోళనకారులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వారిని నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టినా ఫలితం లేకపోయింది. ఎంతకూ ఆందోళన విరమించకపోవడంతో టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడం, ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఒకరు మృతిచెందగా మరికొందరికి గాయాలయ్యాయి. మరణించిన వ్యక్తిని నిర్మల్‌కు చెందిన దామోదర్‌ కురేషియాగా గుర్తించారు.

ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు:

మరోవైపు.. గాల్లోకి కాల్పులు జరిపిన సమయంలో జరిగిన తోపులాటలో పలువురు యువకులు గాయపడ్డారు. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తల నేపథ్యంలో రైల్వేస్టేషన్‌ చుట్టుపక్కల పోలీసులు భారీగా మోహరించారు. అంతకుముందు ఈస్ట్‌కోస్ట్‌ రైలుకు నిప్పు పెట్టడంతో అందులోని ఓ బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరికొన్ని బోగీలకూ మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

More News

Janasena Party : వచ్చీ రాగానే ఆ చట్టాన్ని మార్చేశారు.. మరి కౌలు రైతుల గతేంటీ : జగన్‌పై నాదెండ్ల ఆగ్రహం

రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపు జరగడం లేదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. గురువారం గుంటూరులో

Janasena Party : వచ్చీ రాగానే ఆ చట్టాన్ని మార్చేశారు.. మరి కౌలు రైతుల గతేంటీ : జగన్‌పై నాదెండ్ల ఆగ్రహం

రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపు జరగడం లేదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. గురువారం గుంటూరులో

Janasena : జగన్ గారూ.. సాయంలోనూ కులాలా, వాళ్లని రైతులే కాదంటారా : నాదెండ్ల మనోహర్ విమర్శలు

కేంద్రం అందించే రైతు భరోసా సాయంలోనూ రాష్ర్ట ప్రభుత్వం కులాలను చూస్తోందని ఆరోపించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

Recce : జూన్ 17 నుండి ZEE5 ప్రసారంకానున్న నోవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ "రెక్కీ"

శ్రీరామ్,శివ బాలాజీ,ధన్య బాలకృష్ణ,ఆడుకలం నరేన్, ఎస్టర్ నోరోన్హా,జీవా,శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ నటీనటులుగా కృష్ణ పోలూరి దర్శకత్వంలో

Kiara advani : సామాన్యుల్లా మెట్రో ఎక్కిన వరుణ్ ధావన్ - కియారా.. నెటిజన్ల ఫైర్, ఏం జరిగిందంటే..?

కొన్ని సార్లు సరదాగా చేసే పనులు అప్పుడప్పుడు చిక్కుల్లో పడేస్తాయి. చిన్న విషయమేనని వదిలి వేసే సంఘటనలు సైతం పీకల మీదకు తెస్తాయి.