'అజ్ఞాతవాసి' సెన్సార్ పూర్తి..

  • IndiaGlitz, [Monday,January 01 2018]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల హ్యాట్రిక్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'అజ్ఞాత‌వాసి'. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాను జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమా సెన్సార్ పూర్తి కావ‌డంతో సినిమా విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైన‌ట్లే. నిజానికి డిసెంబ‌ర్ 29న సినిమా సెన్సార్ పూర్త‌వుతుంద‌ని వార్త‌లు వినిపించాయి.

కానీ రెండు రోజులు త‌ర్వాత సినిమా సెన్సార్ పూర్త‌య్యింది. జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు త‌ర్వాత ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు, అభిమానుల్లోనే కాదు..ట్రేడ్ వ‌ర్గాల్లోనూ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్‌, అను ఇమాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తుండ‌గా బొమ‌న్ ఇరానీ, రావు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌బోతున్నారు.