close
Choose your channels

ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్.. ఇంకా ఆసుపత్రిలోనే అమితాబ్, అభిషేక్..

Monday, July 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్.. ఇంకా ఆసుపత్రిలోనే అమితాబ్, అభిషేక్..

పది రోజుల కిందట ఓ న్యూస్ బాలీవుడ్‌ను షేక్ చేసింది. అది బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం. అనంతరం ఆయన కుటుంబమంతా పరీక్షలు చేయించుకోగా అభిషేక్ బచ్చన్, ఆయన సతీమణి ఐశ్వర్యారాయ్ బచ్చన్, వీరి ముద్దుల కూతురు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో అంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే వీరిలో ఐశ్వర్య, ఆరాధ్య మాత్రం చాలా త్వరగా కోలుకున్నారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికీ నెగిటివ్‌గా తేలడంతో వైద్యులు వారిని డిశ్చార్జ్ చేసినట్టు అభిషేక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్.. ఇంకా ఆసుపత్రిలోనే అమితాబ్, అభిషేక్..

‘‘మాకోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగటివ్ అని రిపోర్టులు రావడంతో ఆసుపత్రి నుంచి వారు డిశ్చార్జ్ అయ్యారు. వారిప్పుడు ఇంట్లో ఉంటారు. నేను, నా తండ్రి మాత్రం వైద్యుల పర్యవేక్షణలో ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాం’’ అని అభిషేక్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.