'2.O' లో ఐశ్వర్యా రాయ్!?

  • IndiaGlitz, [Friday,April 06 2018]

సూపర్ స్టార్ రజనీకాంత్, అందాల తార ఐశ్వర్యా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘రోబో’. 2010లో వచ్చిన ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఘన విజయం సాధించింది ఈ చిత్రం. ఈ విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో.. రజనీకాంత్, ఎమీ జాక్సన్ జంటగా ‘2.O’ ని ప్రారంభించారు ఈ ద‌ర్శ‌కుడు. బాలీవుడ్ స్టార్  అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ సైంటిఫిక్ ఫిలిమ్‌కు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటకి వచ్చింది. ‘రోబో’లో నటించిన ఐశ్వర్యా రాయ్ ఈ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇంతవరకు ఈ విషయానికి సంబంధించిన‌ వార్త బయటకి రాలేదు. ‘రోబో’కి ఇది సీక్వెల్ కాదని పలుమార్లు చెప్పిన దర్శకుడు శంకర్.. ఒక‌వేళ ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ పాత్ర ఉంటే.. దాన్ని ఏవిధంగా డిజైన్ చేసి ఉంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

More News

వచ్చాడయ్యో సామి.. 'భరత్‌ అనే నేను' మూడో పాట విడుదల

మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'.

తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా 'ఫ్రెండ్స్ ఇన్ లా'

ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అమిత్ ఖన్నా దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్స్ ఇన్ లా' తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా మన ముందుకు రాబోతుంది.

'అమ్మ‌మ్మ‌గారిల్లు' శాటిలైట్ రైట్స్

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా

'కొత్త కుర్రోడు' ఆడియో విడుద‌ల‌

శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ తో ప్రారంభ‌మైన 'మాటే మంత్రము' సీరియ‌ల్

గంగోత్రి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఎస్.ఎస్. రెడ్డి నిర్మిస్తోన్న 'మాటే మంత్ర‌ము' సీరియ‌ల్ గురువారం ఉద‌యం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియో లో ప్రారంభ‌మైంది.