`RRR` టీమ్‌తో జ‌త క‌ట్టిన బాలీవుడ్ స్టార్‌

  • IndiaGlitz, [Tuesday,January 21 2020]

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'RRR'. 'బాహుబ‌లి' వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది.

అలాగే తెలంగాణ విప్ల‌వ‌వీరుడు కొమురం భీమ్‌గా తార‌క్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా బ‌ట్ కీల‌క పాత్ర‌ల్లోన‌టిస్తార‌నే సంగ‌తి కూడా తెలిసిందే. తాజాగా ఈ సినిమా యూనిట్‌తో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ జాయిన్ అయ్యారు. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేసిన చిత్ర యూనిట్.. రాజ‌మౌళి, అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌లుసుకున్న ఫొటోల‌ను విడుద‌ల చేసింది. అజ‌య్ దేవ‌గ‌ణ్ పాత్ర ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆస‌క్తి అందరరిలో నెల‌కొంది.

ఈ చిత్రంలో ఇంకా స‌ముద్ర‌ఖ‌ని స‌హా హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడ్‌, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ఈ ఏడాది జూలై 30న సినిమాను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిది. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీపై ఎలాంటి ప్ర‌క‌టన ఇవ్వలేదు. దీంతో సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌వుతుందంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

ఇక రెండు నెల‌లు మ‌హేశ్ క‌న‌ప‌డ‌డు...!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఈ సంక్రాంతికి `స‌రిలేరునీకెవ్వ‌రు`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. పెద్ద స‌క్సెస్‌ను సొంతం చేసుక‌న్న సంగ‌తి తెలిసిందే.

`పింక్` మొద‌లెట్టిన ప‌వ‌న్‌.. వైర‌ల్ అవుతున్న ప‌వ‌న్ ఫొటో

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

అల్ల‌రి న‌రేశ్ కొత్త ప్ర‌య‌త్నం.. రీ ఎంట్రీ అనుకోవాలా?

నేటి త‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు అల్ల‌రి న‌రేశ్‌. త‌న‌దైన కామెడీ టైమింగ్ ఉన్న సినిమాల‌తో చాలా త్వ‌ర‌గా 50 సినిమాల‌ను చాలా త్వ‌ర‌గా పూర్తి చేసుకున్న అల్లరి న‌రేశ్‌కి

ఫైట‌ర్ స్టార్ట్‌... బాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్‌

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో

మా నాన్నతో కలిసి మొదటిసారి ఇండస్ట్రీ రికార్డ్ కొడుతున్నాను: అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది.