ఇండిపెండెన్స్ డే  కానుకగా అజయ్ దేవగన్ ‘మైదాన్’

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'మైదాన్'. ఫుట్ బాల్ కోచ్ గా అజయ్ దేవగన్ నటిస్తోన్న మైదాన్ ను క్రీడా నేపథ్యంలో ఒక స్ఫూర్తిమంతమైన కథగా నిర్మిస్తున్నారు. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్య్రదినోత్స‌వ కానుకగా మైదాన్ ను ఆగస్ట్ 13, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రం ఇతివృత్తం ఉంటుందని నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న మైదాన్ ని ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్‌ సహకారంతో జీ స్టూడియోస్ బేన‌ర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

More News

పోలీసులపై గ్యాంగ్‌స్టర్ కాల్పులు.. 8 మంది పోలీసులు మృతి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడటంతో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా..

అది ఫేక్ న్యూస్.. నమ్మకండి: భారత్ బయోటెక్

ప్రముఖులకు సంబంధించిన ఫోటో కనిపిస్తే చాలు.. దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా.. ఆ ఫోటో చుట్టూ ఓ కథ అల్లేసి వైరల్ చేయడం సోషల్ మీడియాలో

ఏపీ కరోనా బులిటెన్ విడుదల..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నేడు ఏపీలో మొత్తంగా 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నాడు జగన్.. నేడు టీడీపీ నేతల్లో ‘శుక్రవారం’ టెన్షన్

కొద్ది రోజుల క్రితం వరకూ ఏపీ సీఎం జగన్‌ను పట్టుకున్న ‘శుక్రవారం’ టెన్షన్ ఇప్పుడు టీడీపీ నేతలను పట్టుకుందా?

‘ఆమె కథ’.. మొన్న నవ్యకు.. నేడు రవికృష్ణకూ కరోనా..

ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో బుల్లితెర షూటింగ్‌లు నిర్వహిస్తోంది. కరోనా గైడ్‌లైన్స్ పాటిస్తున్నప్పటికీ పలువురు మాత్రం కరోనా బారిన పడుతూనే ఉన్నారు.