మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ : 50 కోట్ల క్లబ్‌లోకి అఖిల్.. వరల్డ్ వైడ్‌గా కుమ్మేస్తోన్న వసూళ్లు

  • IndiaGlitz, [Tuesday,November 02 2021]

ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు అఖిల్‌కు ఆ కరువు తీర్చేశాడు బొమ్మరిల్లు భాస్కర్. అఖిల్ , పూజా హెగ్డే జంటగా భాస్కర్ తెరకెక్కించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. భారీ అంచనాలతో దసరాకు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. లాక్‌డౌన్ ఎత్తివేత, కరోనా ఆంక్షల సడలింపుల మధ్య ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ అవుతున్న సమయంలో జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్.

యూత్‌కి బాగా కనెక్ట్ అవ్వడంతో కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా 100 శాతం రికవరీ వెనక్కి తెచ్చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అక్టోబర్ 31వ తేదీ నాటికి 16 రోజు కూడా రూ. 8 లక్షలకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటికీ చాలా చోట్ల వసూళ్లు బాగానే వస్తున్నాయి. మధ్యలో విడుదలైన మహా సముద్రం, పెళ్లి సందడి వంటి సినిమాలు పోటీ ఇవ్వకపోవడంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ దుమ్మురేపుతోంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది. ఈ విజయాన్ని అఖిల్ కంటే కూడా ఎక్కువగా ఆయన తండ్రి నాగార్జున ఎంజాయ్ చేస్తున్నాడు.

More News

'గుడ్‌ల‌క్ స‌ఖి' నవంబర్ 26న విడుదల

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ టైటిల్‌ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ `గుడ్ లక్ సఖి` ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న

'మ‌ణిశంక‌ర్' ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం “మణిశంకర్”.

బిగ్‌బాస్ 5 తెలుగు: ధూంధాంగా దీపావళీ ఎపిసోడ్.. చివరిలో లోబో ఎలిమినేషన్.. !!

బిగ్‌బాస్ 5 తెలుగు దీపావళీ వేడుక ధూమ్ ధామ్‌గా జరిగింది. ప్రత్యేక కార్యక్రమాలతో, స్పెషల్ గెస్ట్‌లతో హౌస్ సందదిగా మారింది.

పునీత్ మరణం: పెళ్లిమండపంలోనే అప్పుకు నివాళి అర్పించిన కొత్తజంట

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

విశాల హృదయం: ఆ 1800 మంది పిల్లల బాధ్యత నాదే.. పునీత్‌కి విశాల్ ఘన నివాళి

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ భారతీయ సినీ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచింది.