జోడి లేకుండానే!

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

అఖిల్‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమా రూపొంద‌నుంది.

అయితే ఈ సినిమాకు హీరోయిన్ ఇంత వ‌ర‌కు ఫిక్స్ కాలేదు. కియరా అద్వాని, ర‌ష్మిక మంద‌న్నా వంటి హీరోయిన్స్ పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చినా వారు డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక త‌ప్పుకున్నారు. 

యూనిట్ హీరోయిన్ కోసం తెగ ప్ర‌యత్నాలు చేస్తుంది. అయితే ఈలోపు సినిమాను స్టార్ట్ చేసేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అనుకుంటున్నారు.  ఈ నెల 24న ఈ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు.

సినిమా జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ట‌. తొలి షెడ్యూల్‌లో హీరోయిన్ లేకుండానే స‌న్నివేశాలను తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. తొలి షెడ్యూల్ పూర్త‌య్యే లోపు హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యంపై యూనిట్ నిర్ణ‌యం తీసుకోనుంది.