close
Choose your channels

మ‌రింత‌ క్లారిటీ ఇచ్చిన అఖిల్‌

Wednesday, November 28, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రింత‌ క్లారిటీ ఇచ్చిన అఖిల్‌

అక్కినేని అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మిస్టర్‌ మజ్ను'. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా.. నేడు ట్విట్ట‌ర్ వేదిక అఖిల్ మిస్ట‌ర్ మ‌జ్నుపై క్లారిటీ ఇచ్చాడు. "ప్ర‌స్తుతం ప్యాచ్ వ‌ర్క్ జ‌రుగుతుంది. డిసెంబ‌ర్ 3 నాటికి ప్యాచ్ వ‌ర్క్ కంప్లీట్ అవుతుంది. ఒక సెట్ సాంగ్ మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌వుతుంది.

జ‌న‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేస్తాం. ఓపిక‌గా వెయిట్ చేస్తున్న అభిమానుల‌కు థాంక్స్‌" అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు అఖిల్‌. అఖిల్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.