'మిస్ట‌ర్ మ‌జ్ను' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Monday,January 21 2019]

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మిస్టర్ మజ్ను'.

ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

More News

ఆ వార్త‌లు అవాస్త‌వం... ప్రాజెక్ట్ క‌న్‌ఫ‌ర్మ్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా సినిమా ను తెర‌కెక్కించ‌నున్నాయి.

జనసేనలోకి ఆకుల.. ఎక్కడ్నుంచైనా పోటీకీ ‘సై’

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆకుల దంపతులు పార్టీలో చేరారు.

న‌లుగురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రారంభం

బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్షన్ నెం.1గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది.

చిరంజీవి క్లాప్ తో ప్రారంభమయిన సాయి ధరమ్ తేజ్ తమ్ముడి చిత్రం

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్  రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది..

'సమాజానికో హెచ్చరిక' చిత్రం రికార్డింగ్ ప్రారంభం

చామకూరి కంబైన్స్ 'సమాజానికో హెచ్చరిక' సినిమా పాటల రికార్డింగ్ S.A స్టూడియో లో ప్రారంభమైంది.