నాడు 'ఢ‌మ‌రుకం'.. నేడు 'అఖిల్‌'..

  • IndiaGlitz, [Monday,November 02 2015]

నాగార్జున‌, అనుష్క జంట‌గా న‌టించిన 'ఢ‌మ‌రుకం' సినిమా గుర్తుందిగా.. మూడేళ్ల క్రితం విడుద‌లైన ఈ సోషియో ఫాంట‌సీ.. బాక్సాఫీస్ వ‌ద్ద మిశ్ర‌మ ఫ‌లితం పొందింది. 2012లో.. నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు కానుక‌గా న‌వంబ‌ర్ 23న రిలీజైన 'ఢ‌మ‌రుకం' త‌రువాత‌.. ఆ కుటుంబం నుంచి వ‌స్తున్న మ‌రో సోషియో ఫాంట‌సీ చిత్రం 'అఖిల్‌'.

ఈ చిత్రం ద్వారానే నాటి 'సిసింద్రీ' అఖిల్‌.. హీరోగా తొలి అడుగులు వేస్తున్నాడు. విశేష‌మేమిటంటే.. 'ఢ‌మ‌రుకం' రిలీజైన న‌వంబ‌ర్‌లోనే అఖిల్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 'ఢ‌మ‌రుకం' లాభాల పంట పండించ‌లేక‌పోయింది.. ఆ లోటుని 'అఖిల్' అయినా తీరుస్తుందేమో చూడాలి. నవంబ‌ర్ 11న రానున్న 'అఖిల్‌'కి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు కాగా.. నితిన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

More News

సంప‌త్ నంది.. న‌వంబ‌ర్ సెంటిమెంట్‌

5 ఏళ్లు.. 3 సినిమాలు.. ఇదీ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌ప్ర‌స్థానం. 'ఏమైందీ వేళ‌', 'ర‌చ్చ' వంటి విజ‌యవంత‌మైన సినిమాల త‌రువాత సంప‌త్ రూపొందించిన చిత్రం 'బెంగాల్ టైగ‌ర్‌'.

అజిత్ తెలుగు టైటిల్ ఫిక్సయింది...

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్,శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న తమిళ చిత్రం ‘వేదాళం’.ఈ చిత్రాన్ని తెలుగులో ‘అవేశం’అనే పేరుతో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

'సైజ్ జీరో' ఆడియో విడుదల

అనుష్క,ఆర్య ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెమూడి దర్శకుడు.

ఆ వార్తల్లో నిజం లేదంటున్న సీతాదేవి...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ఏప్రిల్ 12న సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుందని వార్తలు వినిపించాయి.

సందీప్ తో సరదా గర్ల్

జాదూగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ సోనారిక.ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న సరదాలోనూ నటిస్తోంది.