మరి అఖిల్‌కు కిక్ ఇస్తాడా..?

  • IndiaGlitz, [Tuesday,August 11 2020]

భారీ అంచనాల న‌డుమ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు ‘అఖిల్, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను’ చిత్రాలు బ్రేక్‌ను అందించ‌లేక‌పోయాయి. ఇప్పుడు అఖిల్ త‌న ఆశ‌ల‌ను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ పైనే పెట్టుకున్నాడు. కరోనా ప్రభావం లేకుండా ఉండుంటే ఈ పాటికి సినిమా విడుదలై ఉండేది. కానీ.. కరోనా వల్ల సినిమా ఫైనల్ స్టేజ్ షూటింగ్ ఆగింది. ఈ సినిమా త‌ర్వాత అఖిల్ ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తార‌నే దానిపై క్లారిటీ లేకుండా ఉండింది. కొన్ని నెల‌ల క్రితం అఖిల్ త‌దుప‌రి చిత్రాన్ని త‌మిళ ద‌ర్శ‌కుడితోనే చేస్తార‌ని కూడా వార్త‌లు వినిపించాయి.

ఈ త‌రుణంలో తాజా స‌మాచారం మేర‌కు అఖిల్ అక్కినేని త‌న త‌దుప‌రి చిత్రాన్ని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డితో చేయ‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి.. మెగా హీరోల‌తో సినిమాలు చేయాల‌ని చాలానే ప్ర‌య‌త్నించాడు. కానీ ఏదీ స‌క్సెస్ కాలేదు. ఆ త‌రుణంలో అఖిల్‌కు క‌థ చెప్ప‌డం.. త‌న‌కు న‌చ్చ‌డంతో ప్రాజెక్ట్ ఓకే అయ్యింద‌ట‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని అంటున్నారు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ పెండింగ్ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాతే ఈ సినిమాపై మ‌రింత క్లారిటీ వ‌స్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలంటున్నాయి. ప‌క్కా స‌మాచారం కావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

ఒకరి కూతురిగానో.. భార్యగానో జీవించొద్దు : రేణు దేశాయ్ సంచలన పోస్ట్

ప్రముఖ నటి రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా సంచలన, స్ఫూర్తినిచ్చే పోస్ట్ పెట్టారు. తనను చాలా మంది  ఎలా చూస్తున్నారో పేర్కొంటూ

స్నేహం వైరంగా ఎలా మారింది?

ఇద్ద‌రు స్నేహితులు విరోధులుగా మారడానికి ప‌రిస్థితులు కార‌ణ‌మ‌వుతుంటాయి.

నా ఆలోచ‌న‌ను దొంగ‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు: దేవాక‌ట్ట‌

డైరెక్టర్ దేవాకట్ట ట్విట్టర్ వేదికగా ఓ నిర్మాత‌పై ఆరోప‌ణ‌లు చేశారు. దేవాక‌ట్ట ఎక్క‌డా ఆ నిర్మాత పేరుని ప్ర‌స్తావించ‌క‌పోయినా

ఏపీకి గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో కరోనా తగ్గుముఖం: డా. ప్రభాకర్‌రెడ్డి

ఏపీలో కరోనా ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంది. ప్రతి రోజూ దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. 45వేల మందికి పైగా మృతి

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజూ 50 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి.