అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'... 'ఓ డాడీ' సాంగ్ విడుదల

  • IndiaGlitz, [Friday,November 22 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, రాములో రాముల పాటలు చిత్రం పై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.

ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ స్వరపరచిన చిత్రం లోని మరోగీతం 'ఓ డాడీ' ఈరోజు విడుదలైంది. సాహిత్య విలువలతో కూడిన,ఎన్నో విజయవంతమైన గీతాలను రచించిన గీత రచయిత కృష్ణ చైతన్య ఈ పాట రాసారు. ఈ పాటలో వచ్చే తెలుగు ర్యాప్ కూడా ఆయనే రాయడం విశేషం. తెలుగు ర్యాప్ ని బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా పాడగా, ఇంగ్లీష్ ర్యాప్ ని 'రాహుల్ నంబియార్' పాడారు. ఫిమేల్ ర్యాప్ ని లేడీ కాష్ పాడింది. గాయకుడు 'రాహుల్ సిప్లిగంజ్' ఈ పాటను తన స్టయిల్ లో పాడి ఉర్రూతలూగించారు.. బ్లాజీ ఈ పాటకు గాత్ర సాయం చేశారు.

'ఓ డాడీ' గీతం విడుదలైన కొద్ది సమయానికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో మరో ఫేవరేట్ సాంగ్ గా చార్ట్ బస్టర్స్ లో టాప్ లో నిలుస్తోంది. మరో అద్భుతమైన పాటను అందించి, మరొక సూపర్ హిట్ ఆల్బమ్ ను తన ఖాతాలో థమన్ వేసుకున్నారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

More News

యాంకర్‌ను హోటల్‌కు పిలిచిన సీనియర్ నటుడు!

ఇదిగో మీరు చదువుతున్న ఈ వ్యవహారం టాలీవుడ్ సీనియర్ నటుడి బాగోతం. ఒకట్రెండు కాదు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో ఈయన ఓ వెలుగు వెలుగుతున్నాడు.

అంజలిని ఆ హీరో చెడగొట్టాడు..: నిర్మాత షాకింగ్ కామెంట్స్

అవును మీరు వింటున్నది నిజమే.. ఒకప్పుడు అటు టాలీవుడ్‌లో.. ఇటు కోలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన అంజలిని ఓ హీరో చెడగొట్టాడు.. ఇవేం రూమర్స్ కాదు.. కావాలనే పనిగట్టుకుని రాస్తున్న వార్త అస్సలే కాదు.

‘భయపడేవాడు బేరానికి వస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా..!’

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

గిల్డ్ చొర‌వ త‌ప్పిన స్టార్ హీరోల బాక్సాఫీస్ పోరు

నిర్మాత‌ల శ్రేయ‌స్సు కోసం ఏర్ప‌డిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ సినిమాల రిలీజ్‌ల విష‌యంలో నిర్మాత‌ల‌కు త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తుంది.

'ఎం3'  మూవీ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల

టాలీబీట్స్‌ మీడియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ఎం3'.