‘అల వైకుంఠ‌పుములో’ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తున్నారో తెలుసా?

  • IndiaGlitz, [Monday,April 06 2020]

ఈ ఏడాది తెలుగు సినిమాకు మంచి ప్రారంభ‌మే ద‌క్కింది. రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా కూడా ఉంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వ‌వ‌లో బ‌న్నీ న‌టించిన ఈ హ్యాట్రిక్ మూవీ రూ.200 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సొంతం చేసుకుంది.

‘అల వైకుంఠ‌పుములో’ స‌క్సెస్ చూసిన బాలీవుడ్ మేక‌ర్ అశ్విన్ వ‌ర్దే ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ట‌. వివ‌రాల మేర‌కు రూ. 8 కోట్లతో అశ్విన్ వ‌ర్దే రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ట‌. ప్రారంభంలో బాలీవుడ్ రీమేక్‌లో అర‌వింద్ కూడా భాగ‌మ‌వుతార‌ని వార్త‌లు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేద‌ని బాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు అల వైకుంఠ‌పుర‌ములో బాలీవుడ్ రీమేక్‌లో అక్ష‌య్ కుమార్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. బాలీవుడ్ నిర్మాత అక్ష‌య్‌ను సంప్ర‌దిస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ రీమేక్‌పై ఓక్లారిటీ రానుంది.

More News

ఇండియాలో లాక్‌డౌన్ తప్పనిసరి : కేసీఆర్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో యావత్ ఇండియా వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం విదితమే. ఏప్రిల్-14 వరకూ ఈ లాక్‌డౌన్ ఉండనుంది.

ఇవి తింటే.. కరోనాపై పోరాడొచ్చు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అన్ని దేశాలు పోరాడుతున్నాయి. ఇంతవరకూ ఈ వైరస్‌ను చంపేందుకు ఎలాంటి మందు కనుగొనలేకపోయారు.

‘గేమ్‌ చేంజర్‌’ కోసం ట్రంప్ ఫోన్.. మోదీ ఊహించని షాక్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై అగ్రరాజ్యం అమెరికా కూడా పోరాటం చేస్తోంది. ఇప్పటికే సుమారు 9500 పై చిలుకు మరణాలు సంభవించాయి.

అమెరికాలో పులికి కరోనా.. భారత్‌లో హై అలెర్ట్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మనుషులనే కాదు.. జంతువులనూ వదలట్లేదు. ప్రపంచంలో ఫస్ట్ టైమ్ ఈ మహమ్మారి నాలుగేళ్ల పులికి సోకింది.

ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డికి మాతృ వియోగం

టాలీవుడ్ ప్రముఖ ద‌ర్శక నిర్మాత తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తమ్మారెడ్డి మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమ‌వారం కన్నుమూశారు.