'అల వైకుంఠపురంలో..' నుంచి రేపు మరో స్పెషల్ సర్‌ప్రైజ్!

  • IndiaGlitz, [Wednesday,November 13 2019]

టాలీవుడ్ యంగ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో..’. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి చిత్రబృందం థియేటర్లలోకి తీసుకురానుంది. ఇప్పటికే రెండు సాంగ్స్, లుక్స్, పూజా పాత్ర ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ‘సామజ వరగమన’.. ‘రాములో రాముల’ ఈ రెండు సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. సినిమా రిలీజ్‌కు మూడ్నెళ్లు ముందే ప్రమోషన్స్ షురూ చేసిన మాటల మాంత్రికుడు శరవేగంగా దూసుకెళ్తున్నాడు. అయితే.. ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఓ లెక్క.. రేపు అనగా నవంబర్-14న రాబోయే అప్డేట్ ఓ లెక్క అంట.

బన్నీ, మెగా ఫ్యాన్స్‌కు సర్‌ఫ్రైజ్ ఇవ్వడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. రేపు ‘చిల్డ్రన్స్ డే’ కావడంతో దీన్ని సందర్భాన్ని పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు సినిమా నుంచి మూడో సాంగ్ టీజర్‌ వదలబోతున్నారు. ‘ఓ మై గాడ్ డాడీ’ అంటూ ఈ సాంగ్ టీజర్ సాగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ సైతం చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో #OMGdaddy అనే హ్యాష్‌టాగ్ రాసుంది. ఈ సాంగ్ టీజర్లో ఇద్దరు అంటే చిన్ననాటి బన్నీ, తండ్రి పాత్రలో ఎవరు నటిస్తారనేది రేపు టీజర్‌సాంగ్‌లో తెలుస్తుందన్న మాట. ఇదిలా ఉంటే.. బన్నీ ఇద్దరు పిల్లలకి సంబంధించిన వీడియో బైట్‌పై ఈ సాంగ్‌ను రన్ చేస్తారని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఆ సర్‌ఫ్రైజ్ ఏంటో తెలియాలంటే రేపు 10 గంటల వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

కొత్త షెడ్యూల్‌లో శ‌ర్వానంద్ 'శ్రీకారం'

శ‌ర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం `శ్రీకారం`. 14రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై కిషోర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ ఏడాది ఆగ‌స్ట్ నుండి సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

రానా సినిమా డైరెక్ట‌ర్‌, కెమెరామెన్ మ‌ధ్య గొడ‌వ‌ ?

సాధార‌ణంగా సినిమా మేకింగ్‌లో స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డ‌మ‌నేది కామ‌న్‌గానే జ‌రుగుతుంటాయి. అయితే అవి అప్ప‌టి వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతూ ఉంటాయి.

ఫ్యాన్సీ రేటుకు `స‌రిలేరు నీకెవ్వ‌రు` డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కులు

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి దర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతుంది. సినిమా ఇప్పుడు తుది ద‌శ చిత్రీక‌ర‌ణ‌కు చేరుకుంది. కాగా..

ఎన్టీఆర్‌కు చాలెంజ్ విసిరిన యాంక‌ర్ సుమ‌

సుమ క‌న‌కాల అంటే ఎవ‌రా? అని అనుకుంటారేమో కానీ యాంక‌ర్ సుమ అంటే ఎవ‌రికైనా వెంట‌నే గుర్తు వ‌చ్చేస్తుంది ఈమె. ఈ యాంక‌ర‌మ్మ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌కు చాలెంజ్ విసిరారు.

విలేఖరికి షాకిచ్చిన యమీ గౌతమ్

హీరో నితిన్ హీరోగా న‌టించిన చిత్రాల్లో గౌత‌మ్ మీన‌న్ `కొరియ‌ర్‌బాయ్ క‌ల్యాణ్‌` చిత్రాన్ని తెర‌కెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌత‌మ్ ఈ చిత్రంలో నితిన్ జోడిగా న‌టించింది.