'అల వైకుంఠపురంలో' టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్.. 

  • IndiaGlitz, [Wednesday,December 11 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు నాలుగు గంటల ఐదు నిమిషాలకు సామాజిక మాధ్యమం లో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్,వారి ఆనందానికి ఆకాశమే హద్దు అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ టీజర్ లో నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా అని చెప్పే డైలాగ్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు 'గీతా ఆర్ట్స్' 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

More News

బాబుకు ధైర్యం లేదు.. వైఎస్ జగన్‌కు హ్యాట్సాఫ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం రిలీజ్‌కు నోచుకోవట్లేదు.

‘అమ్మరాజ్యం..’ రిలీజ్ అయితే ప్రతిపక్ష హోదా పోతుందా!?

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’

సౌత్ సినిమాల యూ ట్యూట్ రికార్డులు

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా కార‌ణంగా సినీ ప్రేక్ష‌కులు భాష‌ల‌తో సంబంధం లేకుండా అన్ని సినిమాల‌ను ఆద‌రిస్తున్నారు.

ప్ర‌భాస్ త‌దుప‌రి షెడ్యూల్ ఎప్ప‌టి నుండంటే!

`బాహుబ‌లి`తో నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌ర్వాత `సాహో` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.

వెంకీ, నానిల మల్టీస్టారర్.. ప్రొడ్యూసర్‌గా సురేశ్ బాబు!

తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు విక్టరీ వెంకటేశ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌తో ‘గోపాల గోపాల’,