సాంగ్‌తో షురూ చేయ‌నున్న ఆలియా భ‌ట్‌

  • IndiaGlitz, [Saturday,April 04 2020]

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ప్ర‌స్తుతం సినిమా 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను పూణేలో ప్లాన్ చేశారు. కానీ క‌రోనా ఎఫెక్ట్‌తో షెడ్యూల్ ఆగింది. మ‌రో ప‌క్క ఆలియా ఈ సినిమా నుండి త‌ప్పుకుంద‌ని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని తేలింది. ఆలియా న‌టించ‌డం ప‌క్కా.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఆలియా భ‌ట్ ఆర్ఆర్ఆర్ లో మే నెల నుండి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్‌ల మ‌ధ్య సాంగ్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. అలాగే కీలక స‌న్నివేశాల‌ను కూడా చిత్రీక‌రిస్తార‌ట‌. దీంతో మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లే అవుతుంద‌ట‌. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగానే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ది భాషల్లో భారీ ఎత్తున సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురంభీమ్‌గా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌బోతున్నారు.