ఏపీలో అన్ని బార్డర్లు మూసివేత.. రాకపోకలు బంద్

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించిన విషయం విదితమే. మరోవైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు, సీఎస్‌లకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మాట నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీలకు ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని బార్డర్లను పూర్తిగా మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్లు, ఎస్పీలకు చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌‌లు భేటీ కాన్ఫరెన్స్ నిర్వహించి.. పలు కీలక సూచనలు చేశారు.

రాకపోకలన్నీ బంద్!

‘ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాలు వాహనాలను అనుమతించడం లేదు. రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నాం. ఉదయం నుంచి జిల్లాల మధ్య రాకపోకలను కూడా అనుమతిచడట్లేదు.అత్యవసర సరకు రవాణా, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. బోర్డర్ల మూసివేత కారణంగా ప్రజలు ఎవరు రాకపోకలు కొనసాగించారాదు’ అని ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలకు చీఫ్‌ సెక్రటరీ నీలం సహాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌‌లు దిశానిర్దేశం చేశారు.

మీడియాపై ఆంక్షలొద్దు!

ఇదిలా మీడియా మిత్రులపై హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో పోలీసులు దాడులకు తెగబడ్డారు. మీడియా అని చెబుతున్నా కూడా వినిపించుకోకుండా ఖాకీలు జులుం చిలిపించారు. ఈ క్రమంలో సంబంధిత మీడియా సంస్థలు మంత్రులు, డీజీపీలకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ‘మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎక్కడైనా తిరిగేందుకు అనుమతి ఉంటుంది. లాక్‌డౌన్ సందర్భంగా విధినిర్వహణలో ఉన్న మీడియా సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఇవ్వాలని ఈ మేరకు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది.

More News

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో 'పది' పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే. కాగా.. ఈ క్రమంలో మార్చి 31 న జరగాల్సిన

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ కుర్ర హీరో నితిన్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేసిన సంగతి తెలిసిందే.

క్రితి శెట్టికి అవ‌కాశాల వెల్లువ

కన్న‌డ బ్యూటీ క్రితి శెట్టికి అవ‌కాశాలు వెల్తువెత్తుతున్నాయి. 2009లో క‌న్న‌డ చిత్రం ‘స‌రిగ‌మ‌’ చిత్రంతో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ త‌ర్వాత త‌మిళంలోనూ సినిమాలు చేసింది. అక్క‌డ నుండి

కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీస్‌లు రద్దు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన కేంద్రం తాజాగా..

టాలీవుడ్ నటుడికి కరోనా లక్షణాలు.. గోప్యంగా..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి టాలీవుడ్‌కూ సోకింది!. టాలీవుడ్‌కు చెందిన ఓ సహాయ నటుడికి కరోనా లక్షణాలున్నట్లు తెలుస్తోంది. 2 వారాల కిందట బ్యాంకాక్ నుంచి ఆయన హైదరాబాద్‌కు వచ్చాడని..