close
Choose your channels

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

Tuesday, June 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్షయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తొలుత జులై 1 నుండి 3వరకు పాలీసెట్, పీజీ, ఈ సెట్ పరీక్షలు.. ఎమ్ సెట్ పరీక్ష జులై 6 నుండి 9 వరకు.. లా సెట్ జులై 10న, ఐ సెట్ పరీక్ష జులై 13 న ఈడీ సెట్ జులై 15న నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయంతో ఈ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. మరోవైపు ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.