2024లో పవన్  సీఎం కావాల్సిందే.. మెగా అభిమానులంతా జనసేన వెంటే : చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు

  • IndiaGlitz, [Sunday,May 22 2022]

మెగా అభిమానులు చిరంజీవి, పవన్ కల్యాణ్ , రామ్‌చరణ్, అల్లు అర్జున్ వర్గాలుగా చిలీపోయారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు జనసేన పార్టీకి సైతం చిరంజీవి అభిమానులు అండగా నిలబడటం లేదని.. అందువల్లే 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభావం కనిపించలేదని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు లేదా.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌కు చిరు ఫ్యాన్స్ సపోర్ట్ అందుతుందా లేదా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ తరహా ప్రచారానికి చెక్ పెట్టారు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు. విజయవాడలో ఆదివారం మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వామి నాయుడు మాట్లాడుతూ.. మెగా అభిమానులు పవన్ కళ్యాణ్‌ వెంటే నడుస్తారని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించామని.. జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా తమ వంతు కృషి చేస్తామని స్వామి నాయుడు వెల్లడించారు.

2024లో పవన్ కళ్యాణ్‌ను సిఎంని చేయడమే తమ లక్ష్యమని.. అధికారంలోకి వచ్చేలా ప్రణాళికా బద్దంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. మరికొన్ని సమావేశాలు అనంతరం కార్యాచరణ సిద్దం చేస్తామని పేర్కొన్నారు. అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవని.. పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళతామని స్వామి నాయుడు చెప్పారు. మెగా అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలుగా పని చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

ఇక పొత్తులపై ఆయన మాట్లాడుతూ.. ఆ అంశం తమ పరిధి కాదని, పెద్దలు నిర్ణయిస్తారని స్వామి నాయుడు తెలిపారు. గతంలో ప్రజారాజ్యం పై అనేక కుట్రలు చేశారని.. కుటుంబాలు వదిలి ఆనాడు చిరంజీవి కోసం పని చేశామని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు జనసేనపై అసత్యాలు, పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని... ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిఎం కావడం కోసం అందరూ సంకల్పంతో పని చేయాలని చిరంజీవి అభిమానులకు స్వామి నాయుడు పిలుపునిచ్చారు.

More News

బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ విజేత బిందు మాధవి.. కప్ కొట్టిన తొలి మహిళగా చరిత్ర

సోషల్ మీడియాలో వచ్చిన లీకులే నిజమయ్యాయి. బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్‌ విజేతగా సినీనటి బిందు మాధవి నిలిచారు.

స్టార్ మా లో "సూపర్ సింగర్ జూనియర్"

ఎక్కడెక్కడో వున్న కొత్త కొత్త ప్రతిభావంతులైన గాయనీ గాయకులను పరిచయం చేయడంలో ముందుంటుంది "స్టార్ మా". ఎన్నో అద్భుతమైన స్వరాలను సినిమా రంగానికి పరిచయం చేసింది స్టార్ మా.

శేఖర్ మూవీ నాది.. సినిమా జోలికొస్తే పరువు నష్టం దావా వేస్తా: నిర్మాత సుధాకర్ రెడ్డి వార్నింగ్

యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన శేఖర్ సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆ చిత్ర నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విజేతగా బిందు మాధవి... సోషల్ మీడియాలో లీకులు, గెలిస్తే చరిత్రే

బిగ్‌బాస్ .. బుల్లితెరపై దీనికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హిందీలో అడుగుపెట్టిన ఈ షో.. క్రమంగా భారత్‌లోని ప్రాంతీయ భాషలకు సైతం విస్తరించింది.

ఈసారి ఓట్లు చీలనివ్వను.. బీజేపీని ఒప్పిస్తా , చిన్న పదానికే భయమెందుకు : వైసీపీకి పవన్ చురకలు

వచ్చే ఏపీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరింత క్లారిటీ ఇచ్చారు.