జాహ్నవి ఫిలింస్ బ్యానర్ లో అల్లరి నరేష్ కొత్త చిత్రం

  • IndiaGlitz, [Thursday,March 09 2017]

మలయాళం లో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్‌ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్‌ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్‌ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 'ఓరు వడక్కన్‌ సెల్ఫీ' మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన జి. ప్రజీత్‌ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠతను కొలిపే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెల (మార్చి) 16 నుండి ఏప్రిల్‌ 5 వరకు పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 16 నుండి తదుపరి షూటింగ్‌ మొత్తం హైద్రాబాద్‌లో జరుపుకోనుంది. నిఖిల విమల్‌ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రలో నటించనున్నారు

అల్లరి నరేష్‌, నిఖిల విమల్‌, అవసరాల శ్రీనివాస్‌, హైపర్‌ ఆది, జయప్రకాశ్‌, జీవా, పద్మా జయంతి, తులసి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఉన్ని.ఎస్‌. కుమార్‌, ఎడిటర్‌: నందమూరి హరి, మ్యూజిక్‌: డి.జె.వసంత్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, డైలాగ్స్: పిల్ల జమీందార్ అశోక్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎమ్‌.ఎస్‌. కుమార్‌, సమర్పణ: శ్రీమతి నీలిమ, ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ బొప్పన, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి. ప్రజీత్‌.

More News

రాజశేఖర్ కుమార్తెను పరిచయం చేయనున్న దర్శకుడు

చిత్రం, జయం, నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ ఇప్పుడు రానా, కాజల్ హీరో హీరోయిన్లుగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ప్రారంభం

బాలకృష్ణ, పూరి జగన్నాథ్ అంటేనే క్రేజీ కాంబినేషన్. హీరోయిజంను డిఫరెంట్ స్టయిల్లో ప్రెజెంట్ చేసే దర్శకుడు పూరి, వంద చిత్రాలతో తెలుగు సినిమా రంగంలో తండ్రికి తగ్గ తనయుడుగా రాణిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా గురువారం ఉదయం ప్రారంభమైంది.

రాంగోపాల్ వర్మపై గోవాలో కేసు...

ఉమెన్స్డే సందర్భంగా శుభాకాంక్షలు చెబితే ఎవరిపై అయిన కేసు పెడతారా..కానీ కేసు పెట్టారు. ఇంతకు కేసు పెట్టిన వ్యక్తి గోవా హిందు జాగృతి సంస్థకు చెందిన కరగోన్కర్. మరి ఇంతకు కేసు ఎవరుపై పెట్టారో తెలుసా..రాంగోపాల్ వర్మపై.

'మిస్టర్' రిలీజ్ డేట్

ముకుంద, లోఫర్ చిత్రాల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్టర్`. లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.

జర్నలిస్ట్ పాత్రలో సందీప్ హీరోయిన్...

సందీప్ కిషన్తో రన్ చిత్రంలో నటించిన అనీషా అంబ్రోస్ ఇప్పుడు మంచు మనోజ్ చిత్రంలో నటిస్తుంది. గతంలో అలియాస్ జానకి చిత్రంలో నటించిన అనీషా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ హీరోయిన్గా నటిస్తుందని అనుకున్నారు.