'ఎవరు' తో శేష్ హ్యాట్రిక్ కొట్టేశాడు: బన్నీ

  • IndiaGlitz, [Monday,August 19 2019]

క్షణం, గూఢచారి చిత్రాల తర్వాత అడివిశేష్, ఎవరు'తో హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని బన్నీ కూడా అంగీకరించాడు. 'ఎవరు' సినిమాను చూసిన స్టైలిష్ స్టార్ సినిమాకు ఫిదా అయ్యాడు. ఎంతలా అంటే వెంటనే 'ఎవరు' యూనిట్‌ను అభినందిస్తూ ట్వీట్ కూడా పెట్టేశాడు.

''ఎవరు సినిమాను రాత్రే చూశాను. ట్విస్టులు, టర్న్‌లతో సినిమా ఈ అమేజింగ్ మర్డర్ మిస్టర్ నన్ను ఆకట్టుకుంది. సినిమా చాలా బాగా నచ్చింది. రైటింగ్ పరంగానే కాదు.. టెక్నికల్ అంశాల పరంగా కూడా సినిమా బావుంది. వరుస విజయాలను సాధిస్తున్న శేష్ ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించాడు. అలాగే రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర, మురళీశర్మ సహ ఇతర నటీనటులు చక్కగా నటించారు. పీవీపీగారికి, వెంకట్ రామ్‌జీగారికి అభినందనలు'' అన్నారు అల్లు అర్జున్.