నాలుగు నెల‌ల ముందే చెప్పిన బ‌న్నీ...

  • IndiaGlitz, [Thursday,April 09 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్యం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూడో చిత్ర‌మిది. ఈ సినిమా కోసం బ‌న్నీ కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. చిత్తూరు జిల్లాలోని శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతోంది. బ‌న్నీ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశాడ‌ని బ‌న్నీ అభిమానులు సంతోషప‌డుతున్నారు.

కానీ బ‌న్నీ టైటిల్ నాలుగు నెల‌ల క్రిత‌మే అనౌన్స్ చేశాడ‌ని తెలిసి అంద‌రూ షాక‌వుతున్నారు. అదేంటి పుష్ప అనే టైటిల్‌ను బ‌న్నీ నాలుగు నెల‌ల క్రిత‌మే చెప్పాడా? అనే సందేహం క‌లగొచ్చు. వివ‌రాల్లోకెళ్తే.. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 27న సుకుమార్‌కు అల్లు అర్జున్ ట్వీట్ పెట్టాడు. ‘‘సుక్కు జుట్టు రంగు మారింది. నా చర్మం కలర్ మారింది. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మాలో ఇంకా తగ్గలేదు. దానికి త్వరలోనే మీరు సాక్షులుగా నిలుస్తారు’’ అంటూ పుష్ప టైటిల్‌ను డిఫ‌రెంట్‌గా రాసి పోస్ట్ చేశాడు బ‌న్నీ. ఇప్పుడు ఆ ట్వీట్ చూసినవారు అదేదో డిజైన్ అనుకున్నామే, టైటిలా అని నోరెళ్ల బెడుతున్నారు.

More News

కరోనాతో చనిపోతే.. తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇండియాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్న విలన్

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు ప్రముఖులు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు.

గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళకు అండగా చిరు

మెగాస్టార్ చిరంజీవి రీల్‌లోనే కాదు.. రియల్‌గా కూడా హీరో అనిపించుకున్న సందర్భాలున్నాయి. ఇందుకు కారణం ఆయనకున్న పెద్ద మనసే. తమకు కష్టం వచ్చింది ఆదుకోండి

టీవీ యాంకర్ శాంతి అనుమానాస్పద మృతి.. ఫోన్ స్వాధీనం!

ప్రముఖ తెలుగు టీవీ యాంకర్‌, సీరియల్‌ నటి శాంతి (విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. నగరంలోని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్‌ కాలనీలోని

పోలీసుల‌కు సెల్యూట్ చేసిన మ‌హేశ్‌, చైత‌న్య‌

క‌రోనా వైర‌స్‌ను నివారించ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. క‌ర్ఫ్యూను విధించాయి. ముఖ్యంగా పోలీసు శాఖ‌వారు ప్ర‌జ‌లను రోడ్ల మీద‌కు రాకుండా