ఆహా ఓటీటీ... అల్లు అర్జున్‌ని దింపుతోన్న అల్లు అరవింద్, నిజమైతే ఫ్యాన్స్‌కి పండగే

  • IndiaGlitz, [Saturday,January 22 2022]

సినిమాలు , షూటింగ్‌లు, వ్యాపారాలతో బిజీగా వుండే స్టార్స్ ఇటీవలి కాలంలో తమ పంథా పూర్తిగా మార్చేశారు. ఒకరి తర్వాత ఒకరు బుల్లితెర మీద హోస్ట్‌లుగా రాణిస్తున్నారు. తద్వారా ఇంటిల్లిపాదికి దగ్గరవుతున్నారు. అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, నాని, కమల్ హాసన్ వంటి స్టార్స్ హోస్ట్‌లు అదరగొడుతున్నారు. వీరిని చూసి రానున్న రోజుల్లో మరింత మంది వ్యాఖ్యాతలుగా మారుతున్నారు. ఓటీటీల రాకతో ఈ కల్చర్ మరింత ఎక్కువైంది.

తెలుగులో రంగ ప్రవేశం చేసిన ఆహా ఓటీటీ మంచి ఆదరణతో బడా సంస్థలకు సైతం పొటీ ఇస్తోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ.. ‘‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’’ పేరుతో చేసిన టాక్ షోకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. తనదైన శైలిలో స్టార్స్‌ను ఇంటర్వ్యూ చేసి షోను రక్తి కట్టించారు బాలయ్య. ఈ షో హిట్ అవ్వడంతో ఆహా ఓటీటీని మరింత పాపులర్ చేయాలని ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారట నిర్వాహకులు. ఇందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను రంగంలోకి దింపబోతున్నారట. ఆయన హోస్ట్‌గా ఆహాలో ఓ టాక్ షో మొదలుపెట్టాలన్న ప్లాన్‌లో ఉన్నట్టుగా ఫిలింనగర్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

అయితే అది అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందుచేత ఈ టాక్ షో పట్టాలెక్కే వరకు నమ్మలేం. కాకపోతే సొంత సంస్థ కాబట్టి.. వీలు కుదిరితే దీనికి బన్నీ ఓకే చెప్పవచ్చు. ఏది ఏమైనా దీనిపై ఆహా ఒక ప్రకటన చేసే వరకు ఓ నిర్ణయానికి రాలేం.

More News

రహస్యంగా తల్లిదండ్రులైన ప్రియాంక- నిక్ జోడి.. అభిమానులకు షాక్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్‌ దంపతులు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. సరోగసీ విధానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈ జంట ప్రకటించింది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అఖండ !!

ఒక సంచలనం.. ఒక ప్రభంజనం అని తెలుగు ప్రేక్షకులు ముక్త కంఠంతో విశేషమైన విజయాన్ని అందించిన "అఖండ" సినిమా "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ అవుతుంది.

ముంబైలో కొత్త ఇంట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే.. ప్రత్యేక పూజలు, ఫోటోలు వైరల్

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా చెలామణి అవుతోన్న పూజా హెగ్డే ముంబైలో తన డ్రీమ్ హౌస్‌లో అడుగుపెట్టారు.

హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు.. కారణమిదే

సినిమాలు,  షూటింగులు తప్పా పర్సనల్ విషయాలతో రవితేజ ఎప్పుడూ వార్తల్లో ఉండరు. ఆయన కుటుంబం కూడా ఎక్కువగా బయట కనిపించదు.

మెగా నందమూరి ఫ్యాన్స్‌కు ఊరట.. ‘‘ఆర్ఆర్ఆర్’’ కొత్త రిలీజ్ డేట్, ఈ రెండింటిలో ఏదో ఒకరోజు

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’.