అల్లు అర్జున్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో  #AA21

అల వైకుంఠపురం లో వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తో సరి కొత్త ఇండస్ట్రీ రికార్డ్స్ నెలకొల్పి, అదే ఉత్సహంతో వరుస సినిమాలుతో తన అభిమానులని అలరించడానికి సిద్ధం అవుతున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప కి సంబంధించిన వివిధ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరో క్రేజీ సినిమాతో ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు స్టైలిష్ స్టార్, వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కొరటాలశివ తో కలిసి సినిమా చేయబోతున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరో అగ్ర నిర్మాణ సంస్థ జీ ఏ 2 పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణంలో భాగస్వామిగా ఉండనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మిత్రులు శాండీ, స్వాతి, నట్టి లు జీ ఏ 2 పిక్చర్స్ సారథ్యంలో ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.

స్నేహితులే చిత్ర నిర్మాణ సారధులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తన స్నేహితుల్ని, బంధువుల్ని, సన్నిహితులని తన సినిమాల్లో భాగం చేస్తుంటారు. ‘రేసుగుర్రం’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘పుష్ప’ సినిమా నిర్మాణంలోనూ ఆయన బంధువులు భాగం పంచుకున్నారు. మరోసారి అదే తరహాలో తన మిత్రులు శాండీ, స్వాతి, నట్టి లకు ఈ చిత్రానికి సహ నిర్మాతులుగా వ్యవహరించేందుకు అవకాశం ఇచ్చారు. ఇది ఇలా ఉండగా డైరెక్టర్ కొరటాల శివ కి సన్నిహితుడు, స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించడం విశేషం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ కి ఫుల్ క్రేజ్

అటు డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే వివిధ స్టార్ హీరోలతో పని చేశారు, ఇటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వివిధ ప్రముఖ దర్సకులతో పని చేశారు. కానీ ఈసారి మాత్రం వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ పై అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల్లో ఇటు సాధరణ ప్రేక్షకులుల్లో భారీగా అంచనాలు నెల కొన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వ బోతుంది.

బ్యానర్ : యువ సుధ ఆర్ట్స్ - జీ ఏ 2 పిక్చర్స్

More News

9 మందిని పొట్టనబెట్టుకున్న శానిటైజర్..

ఏపీలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.

తాత గొప్ప‌త‌నం ఈరోజు ఇంకా బాగా తెలుస్తుంది:  అల్లు అర్జున్‌

ఈరోజు సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, దివంగ‌త అల్లు రామ‌లింగ‌య్య వ‌ర్ధంతి. ఆయ‌న 16 వ‌ర్ధంతి నేడు. సినీ ప్రియులు, ఆయన కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తున్నారు.

బర్త్ డే సందర్భంగా వలస కార్మికులకు సోనూసూద్ సర్‌ప్రైజ్..

పుట్టినరోజు చేసుకుంటున్న వారికి సన్నిహితులు బహుమతులిచ్చి సర్‌ప్రైజ్ చేయడం కామన్‌. కానీ రీల్ లైఫ్ విలన్..

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ పునర్నియామకం..

ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. గురువారం అర్థరాత్రి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమిస్తూ జీవో జారీ చేసింది.

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. నేడు 1986 కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ డబుల్ డిజిట్‌లో కేసులు నమోదవుతున్నాయి.