అల్లు అర్జున్‌, లింగుస్వామి, జ్ఞాన‌వేల్ రాజా కాంబినేష‌న్లో ద్విభాషా చిత్రం

  • IndiaGlitz, [Thursday,September 22 2016]

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, తెలుగు, త‌మిళం లో తిరుగులేని స్టైలిష్ మేక‌ర్ గా గుర్తింపుపొందిన జ్ఙాన‌వేల్ రాజా నిర్మాత‌గా, సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియోగ్రీన్ ప్రొడ‌క్ష‌న్‌-12 గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపోందుతున్న చిత్ర వివ‌రాలు ఈ రోజు చెన్నై మీడియా మీట్ లో తెలిపారు.

ప్ర‌స్తుతం దువ్వాడ జ‌గన్నాథం చిత్రం షూటింగ్ లో బిజీగా వున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ 18 వ చిత్రం గా స్టూడియోగ్రీన్ సంస్ధ 12వ‌ చిత్రంగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్ప‌టికే తెలుగు, కన్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌రుస విజ‌యాల‌తో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంతో త‌మిళం లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్ప‌టికే భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ ప్రాజెక్ట్ వివ‌రాలు ఈ రోజు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, నిర్మాత జ్ఙాన‌వేల్ రాజా, ద‌ర్శ‌కుడు లింగుస్వామి పాత్రికేయుల‌కి తెలియజేశారు.

అల్లు అర్జున్ తమిళంలోకి ఎంట్రీ ఇవ్వడంపై సీనియర్ యాక్టర్ శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకుంటారని ఆశాభావం వ్య‌క్తం చేసారు.

ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.... నాకు చెన్నై గా పేరు మారకుముందు నుంచి అంటే మద్రాస్ తో ఎంతో అనుబంధం ఉంది. నాకు లోకల్ ప్లేస్ లాగే అనిపిస్తుంది. నన్ను మీరు స్థానికుడిగా భావించొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తమిళంలో ఎంట్రీ ఇచ్చే విషయంలో చాలా ఆలోచించాం. ఓ మంచి డైరెక్టర్ ద్వారానే ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నాను. నన్ను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న లింగుస్వామికి, జ్ఞానవేల్ రాజాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.

నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.... చాలా రోజులుగా నేను ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాను. అల్లు అర్జున్ ని తమిళంలో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం రావడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నాను అన్నారు. ఫిబ్రవరి ద్వితియార్థంలో లేదా మార్చి ప్రథమార్థంలో చిత్ర షూటింగ్ ప్రారంభమౌతుంది. ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తాం అని తెలిపారు.

దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ... నేను ఇప్పటివరకు కలిసిన స్టార్స్ లో మోస్ట్ ఎనర్జిటిక్, హార్డ్ వర్కింగ్ స్టార్ అల్లు అర్జున్. చెన్నైలో చాలా మందికి అల్లు అర్జున్ యాక్టింగ్, డ్యాన్సులంటే ఇష్టం. అందుకే ఆయనతో ఓ మంచి కథతో తమిళంలో సినిమా చేయాలనుకున్నాం. అలా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యింది అన్నారు.

More News

సుమంత్ న‌రుడా..! డోన‌రుడా..!కు ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు..!

ప్రేమ‌క‌థ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై...స‌త్యం, గౌరి, గోదావ‌రి చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన అక్కినేని ఫ్యామిలీ హీరో న‌వ సమ్రాట్ సుమంత్. గోల్కండ హైస్కూల్, ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు చిత్రాల త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకుని సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా..! ఈ చిత్రం ద్వారా ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్ గా, మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడి

ఎం.ఎస్.ధోని ఆడియో వేడుక‌ అతిధులు వీళ్లే..!

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని జీవిత‌క‌థ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ మూవీ ఎం.ఎస్.ధోని అన్ టోల్డ్ స్టోరీ. ఈ చిత్రాన్ని నీర‌జ్ పాండే తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ధోని పాత్ర‌ను పోషించారు.

తమిళంలోకి రాశిఖన్నా...

అందాల హీరోయిన్ రాశిఖన్నా త్వరలోనే హైపర్ చిత్రంతో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగు సినిమా రంగంలోనే నటించిన రాశిఖన్నా ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ కానుంది. హీరో సిద్ధార్థ గురించి తెలుగు ప్రేక్షకులు ఇంకా మరచిపోలేదు.

పవన్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ మారాడు....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం కాటమరాయుడు గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సికింద్రాబాద్ లో చిత్రీకరణ ప్రారంభమైంది.

'ఈడు గోల్డ్ ఎహే' ఓవర్ సీస్ హక్కులు...

డాన్సింగ్ స్టార్సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్హిట్చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్ టైన్మెంట్స్(ఇండియా) ప్రై. లిమిటెడ్పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'.