నా మొద‌టి కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ మృతి న‌న్ను బాధిస్తోంది - అల్లు అర్జున్

  • IndiaGlitz, [Friday,July 03 2020]

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో 'మాస్టర్ జీస‌, 'మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ' అని అంతా ప్రేమగా పిలిచే ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండె పోటుతో శుక్రవారం క‌న్ను మూసిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరోజ ఖాన్ మృతికి సంతాపం ప్ర‌క‌టిస్తూ ఆమె కుటుంబ సభ్యులుకు, సన్నిహితులుకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, అలానే స‌రోజ్ ఖాన్ తో కలిసి డాడీ సినిమా కోసం పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

తన సినీ కెర్రిర్ కు తొలి కొరియోగ్రాఫర్ గా సరోజ ఖాన్ వంటి అనుభవశాలితో పని చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లుగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఆమె మరణం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు గా అల్లు అర్జున్ అభివర్ణించారు. మెగాస్టార్ చిరంజీవి గారు హీరో గా నటించిన డాడీ సినిమాకు అప్పటి ఇండియన్ స్టార్ కొరియోగ్రాఫర్ స‌రోజ్ ఖాన్ కొరియోగ్రాఫ‌ర్ గా పనిచేశారు. ఈ సినిమాతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ జ‌రిగింది. 

ఈ సినిమాలో డాన్స‌ర్ గా అల్లు అర్జున్ వేసిన స్టైప్స్ మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ వేసిన‌ ఈ డాన్స్ మూమెంట్స్ ని స్వ‌యంగా స‌రోజ్ ఖాన్ కంపోజ్ చేయ‌డం విశేషం. చిరు న‌టించిన చూడాల‌ని ఉంది సినిమాకి కూడా స‌రోజ్ ఖాన్ కొరియోగ్రాఫ‌ర్ గా ప‌ని చేశారు.

More News

మోదీ లద్దాఖ్ పర్యటనపై పరోక్షంగా స్పందించిన చైనా..

లద్దాఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించి సైనికుల్లో ఉత్సాహాన్ని నింపిన విషయం తెలిసిందే.

‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్‌ పేరుతో దారుణం.. కేసు నమోదు

సోషల్ మీడియా మోసాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. అమ్మాయిల నంబర్లను సేకరించి సెలబ్రిటీల పేరుతో కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.

మోదీ రాకతో ఉద్విఘ్నం.. నినాదాలతో హోరెత్తించిన జవానులు

లద్దాఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ రాకతో అక్కడ కొంతసేపు ఉద్విఘ్న భరిత వాతావరణం నెలకొంది.

దేశంలో ఒక్కరోజే 20 వేలు దాటిన కరోనా కేసులు..

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్‌డౌన్ అనంతరం కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి.

కరోనా అంతమైందంటూ పార్టీ.. వేలల్లో హాజరైన ప్రజలు

కరోనా కారణంగా ప్రపంచమే వణికిపోతుంటే.. ఓ దేశంలో మాత్రం ‘కరోనా వైరస్ పార్టీ’ పేరుతో పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం జరిగింది.