తొందర‌‌పడొద్దంటున్న బ‌న్నీ... ఇన్‌స్టాలో బ‌న్నీ హ‌వా

  • IndiaGlitz, [Monday,June 08 2020]

క‌రోనా ఎఫెక్ట్‌తో కొనసాగుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల సినిమాల షూటింగ్స్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఓకే చెప్పింది. విధి విధానాలు ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈ త‌రుణంలో కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నారు. మ‌రో ప‌క్క బ‌న్నీ త‌న పాన్ ఇండియా చిత్రం పుష్ప‌ను స్టార్ట్ చేస్తాడ‌ని భావించారు. అయితే బ‌న్నీ, సుకుమార్ అండ్ టీమ్ ఏదో త్వ‌ర త్వ‌ర‌గా సినిమా చేసేయాల‌ని అనుకోవ‌డం లేద‌ట‌. ఇంకా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేయ‌మ‌ని బ‌న్నీ ద‌ర్శ‌క నిర్మాత‌లకు చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే పుష్ప చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.

ఇన్‌స్టాలో బ‌న్నీ హ‌వా:

బ‌న్నీకి సోష‌ల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఫేస్‌బుక్‌లో 13.1 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. సౌతిండియాలో బ‌న్నీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ను ద‌క్కించుకున్నాడు అల్లు అర్జున్.

More News

తెలంగాణ‌లో షూటింగ్స్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌

కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు.

వెబ్‌ ఆడియన్స్‌ మనసులు గెలిచి పెద్ద విన్నర్‌గా నిలిచిన 'లూజర్‌'

భారతదేశంలోనే అత్యధికంగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు/కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ 'జీ 5'. ఇందులో 100కు పైగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు ఉన్నాయి.

మ‌రోసారి ‘ఢీ’ కొట్ట‌బోతున్నారా..?

మంచు విష్ణు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఢీ’. విష్ణుకు తొలిసారి బ్రేక్ దక్కిన చిత్రమిది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో

బ్రేకింగ్ : సీఎం కేజ్రీవాల్‌కు అస్వస్థత.. రేపు కరోనా టెస్ట్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అస్వస్థతకు లోనయ్యారు. కరోనా లక్షణాలు అయిన జ్వరం, తలనొప్పి ఉండటంతో అప్రమత్తమైన సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

కీర్తి సురేశ్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ 'పెంగ్విన్' టీజ‌ర్ విడుద‌ల‌

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నటీమణులైన సమంత అక్కినేని, తాప్సీ పన్ను, త్రిష మరియు మంజు వారియర్‌లు సంయుక్తంగా కీర్తి సురేష్ నటించగా