బన్నీ కొత్త లుక్ కోసం స్పెషల్ డైట్

  • IndiaGlitz, [Monday,October 21 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోని తన పాత్ర కోసం సరికొత్త డైట్‌ను ఫాలో అయ్యాడ‌ట‌. అస‌లు ఇంత‌కు బ‌న్నీ డైట్‌ను ఎందుకు ఫాలో అయ్యాడు? అనే విష‌యంలోకి వెళితే.. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'అల...వైకుంఠ‌పుర‌ములో..'. ఈ సినిమాలో లుక్ కోసం బ‌న్నీ 14 కిలోలు బ‌రువు త‌గ్గాల‌ని డైరెక్ట‌ర్ సూచించాడ‌ట‌. దీంతో బ‌న్నీ కీటో డైట్‌ను ఫాలో అయ్యాడ‌ట‌. కీటో డైట్ అంటే కార్బోహైడ్రేట్స్‌ను ఆహారంలో త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవ‌డ‌మేన‌ట‌. అంతే కాకుండా ప్ర‌తిరోజూ రెండు గంట‌ల పాటు రెగ్యుల‌ర్‌గా జిమ్ చేశాడ‌ట‌. దీంతో బ‌రువు త‌గ్గి మ‌రింత యంగ్‌గా త‌యారైయ్యాడ‌ట బ‌న్నీ.

పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ట‌బు కీల‌క పాత్ర పోషిస్తుంది. జ‌య‌రాం, ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లు అరవింద్, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ కోటీశ్వ‌రుడి బిడ్డ పేద‌వాడుగా, పేద‌వాడి కొడుకు కోటీశ్వ‌రుడిగా పెరుగుతారు. త‌ద‌నంత‌ర ప‌రిస్థితులు ఎలా మారుతాయ‌నేదే ఈ సినిమా క‌థాంశమ‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా త‌ర్వాత గ్యాప్ తీసుకున్న బ‌న్ని ఈ సినిమాను చేస్తున్నాడు.

More News

'తుపాకీ రాముడు' ఓ సందేశాత్మ‌క చిత్రం: తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు

బిత్తిరి స‌త్తి, ప్రియ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం `తుపాకీ రాముడు`. ర‌స‌మ‌యి ఫిలింస్ ప‌తాకంపై టి.ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో

ఏపీలో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జి మంత్రులు వీరే...

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీడీపీ బాటలోనే వైసీపీ ఇసుక దోపిడీ

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలకంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని,

కార్మికుల కోసం పవన్ కల్యాణ్ భారీ పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం కుదేలై ఉపాధి లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న కార్మికుల బాధలను అందరికీ తెలియచేసి, కార్మికులకు అండగా నిలిచేందుకు జనసేన అధినేత

ప్ర‌ధానికి పూరి లేఖ‌

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ గురించి కొన్ని సూచ‌న‌లు ఇస్తూ బ‌హిరంగ లేఖ రాశారు.