పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో అల్లు శిరీష్....

  • IndiaGlitz, [Thursday,April 28 2016]

అల్లుశిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ కొత్త చిత్రం ఈరోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, శ్రీనువైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్.శైలేంద్ర బాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మాతలు.

హీరోగా నా 4వ సినిమా. దర్శకుడు ఎం.వి.ఎన్.రెడ్డితో చిన్నప్పటి నుండి పరిచయం ఉంది, మంచి మిత్రుడు. ప్రస్తుతం లోకేషన్స్ చూస్తున్నారు. జూలై ఫస్ట్ వీక్ నుండి సినిమా ఉంటుంది. లవ్ ఎంటర్ టైనర్. 700 ఏళ్ల పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. అందుకోసం వర్క్ చేయాల్సి ఉంటుంది. శ్రీరస్తు శుభమస్తు సినిమా తర్వాత ఈ సినిమాపై కాన్ సన్ ట్రేషన్ చేస్తాను. కామెడితో పాటు పెర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న రోల్. ఇలాంటి రోల్ కోసం సంవత్సరం నుండి వెయిట్ చేస్తున్నానని హీరో అల్లు శిరీష్ అన్నారు.

తెలుగులో మా శైలేంద్ర ప్రొడక్షన్స్ లో వస్తున్న రెండో సినిమా. కామెడి ఎంటర్ టైనర్. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అల్లు శిరీష్ కు థాంక్స్ అని నిర్మాతలు ఎస్.శైలేంద్ర బాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి తెలిపారు. దర్శకుడిగా తొలి చిత్రం. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలను దర్శకుడు ఎం.వి.ఎన్.రెడ్డి తెలియజేశారు.

More News

వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'మిస్టర్ ' ప్రారంభం

ముకుంద,కంచె చిత్రాలతో తిరుగు లేని హీరో అనిపించుకున్న వరుణ్ తేజ్ మూడో సినిమా 'మిస్టర్ 'గురువారం హైదరాబాద్ లో ఆరంభమైంది.

బాలయ్య 100వ సినిమా కథ ఆయనదా?

బాలయ్య ప్రెస్టిజియస్ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

'బ్రహ్మోత్సవం' ఆడియో ఒకరోజు వెనక్కి వెళ్ళింది....

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'.

మహేష్ ' పోకిరి' కి పదేళ్లు...

ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ...వాడే పండుగాడు ఈ డైలాగ్ ఇప్పటికి ఫేమసే మరి.

శృతిహాసన్ చేతుల మీదుగా 'ఆక్సిజన్' మోషన్ పోస్టర్ విడుదల

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్'.