అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా రుక్షార్ థిల్లాన్

  • IndiaGlitz, [Friday,June 01 2018]

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించగా... సూపర్ డూపర్ హిట్టయిన ఎబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ డ్ దేసి ) చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన నటించే లక్కీ ఛాన్స్ రుక్షార్ థిల్లాన్ సొంతం చేసుకుంది.

కృష్ణార్జున యుద్ధం చిత్రంతో రుక్షార్ అందరి హృదయాల్ని దోచేసింది. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

అల్లు శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ధం ఫేం రుక్షార్ థిల్లాన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశాం. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

More News

ర‌వీంద్ర‌భార‌తిలో నటుడు ఉత్తేజ్ కుమార్తె చేత‌న ఉత్తేజ్ 'నాయిక‌', 'అనంత‌' నాట్య కళా రూపాల ప్ర‌ద‌ర్శ‌న‌

గురువారం సాయంత్రం  హైద‌రాబాద్ ర‌వీంద్ర భార‌తిలో  భాషా సంస్కృతి శాఖ  ఆధ్వ‌ర్యంలో సినీ న‌టుడు, ర‌చ‌యిత ఉత్తేజ్ కుమార్తె చేత‌న ఉత్తేజ్ `అష్ట‌విధ‌నాయిక`

ప్రపంచవ్యాప్తంగా జూలై 5న నారా రోహిత్, జగపతిబాబు 'ఆటగాళ్ళు'

ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నారా రోహిత్‌, జగపతిబాబు నటిస్తోన్న సినిమా ‘ఆటగాళ్ళు’. 'ఆంద్రుడు' చిత్ర దర్శకుడు  పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న కాజల్ అగర్వాల్

యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా

ఐపిసి సెక్షన్.. భార్యాబంధు పాటల విడుదల

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు".

మ‌హేష్ 25 కాన్సెప్ట్ అదేనా?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, ఉత్త‌రాది భామ‌ పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "మహేష్‌ 25వ సినిమా" తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.