కుక్కల పట్ల అమానుషంగా బ్లూక్రాస్.. అసత్యం అంటూ ఖండించిన అమల

  • IndiaGlitz, [Friday,July 30 2021]

అక్కినేని అమల జంతు ప్రేమికురాలు. ఈ విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఆమె జంతు హింసకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం అమల బ్లూ క్రాస్ కు చైర్ పర్సన్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో బ్లూ క్రాస్ పై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదీ చదవండి: రాజమౌళి రిలీజ్ చేసిన రాఘవేంద్ర రావు ఫస్ట్ లుక్ వీడియో

అందుకు కారణం సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి చేస్తున్న ప్రకటనలే. బ్లూ క్రాస్ సంస్థ హైదరాబాద్ లో వీధి కుక్కలని అన్యాయంగా బంధించి వాటికీ పిల్లలు పుట్టకుండా ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) సర్జరీ చేయిస్తున్నారని.. అవి పూర్తిగా కోలుకోకుండానే అమానుషంగా రోడ్లపై వదిలేస్తున్నారని ఆరోపించాడు.

ఈ వార్త వైరల్ కావడంతో బ్లూ క్రాస్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. శునకాల పట్ల ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తిస్తారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో బ్లూ క్రాస్ చైర్మన్ అమల అక్కినేని స్వయంగా ఈ దుష్ప్రచారాన్ని ఖండించింది. ఈ వార్తల పట్ల వివరణ ఇచ్చింది.

బ్లూ క్రాస్ ఎప్పుడూ జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తించదు అని ఆమె లేఖలో పేర్కొన్నారు. జి హెచ్ ఎం సి సూచనలకు అనుగుణంగానే తాము నడుచుకుంటున్నట్లు అమల తెలిపారు. ఏబీసీ సర్జరీ చేసిన తర్వాత వెంటనే వాటిని వదిలేయడం లేదు. కొన్ని రోజులపాటు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచుతున్నామని, అవి కోలుకున్న తర్వాతే వాటి స్వస్థలాల్లో వదిలి పెడుతున్నాం అని అమల అన్నారు.

దాదాపు 2 వేలకు పైగా శునకాలని బంధించి ఆపరేషన్ చేసి అవి కోలుకోకుండానే రోడ్లపై వదిలేశారని ఆరోపించాడు. అధికారుల ఒత్తిడి, టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఇలా విచ్చల విడిగా శునకాలని బంధిస్తున్నట్లు నెటిజన్ ఆరోపించాడు. ఇదంతా దుష్ప్రచారం అని అమల కొట్టిపారేశారు.

More News

రాజమౌళి రిలీజ్ చేసిన రాఘవేంద్ర రావు ఫస్ట్ లుక్ వీడియో

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

పవన్, మహేష్, ప్రభాస్ ఒకే ఒక్కసారి.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ బాక్సాఫీస్ ఫైట్!

తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతికి కోడి పందేలు ఎలాగో.. సినిమాలు అలాగ. పల్లెటూర్లలో కోడి పందేలతో ఎంజాయ్ చేయడం..

శ్రీదేవి సోడా సెంటర్ టీజర్: అప్పటి నుంచి నా పేరు సోడాలు శ్రీదేవి అయింది

హీరో సుధీర్, పలాస డైరెక్టర్ కరుణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి.

ఆఫీషియల్: స్టైలిష్ పోస్టర్ తో రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్.

పోసానికి కరోనా.. దర్శక, నిర్మాతలు నన్ను క్షమించాలి అంటూ..

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా పోసాని తెలియజేశారు.