అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ షూటింగ్ పూర్తి..

  • IndiaGlitz, [Monday,September 24 2018]

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ పూర్తైపోయింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో హీరో హీరోయిన్ల‌పై చివరి పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు. శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈయ‌న పుట్టిన రోజు కానుక‌గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ పాత్రల‌ను ప‌రిచ‌యం చేసారు. ఇది చాలా కొత్త‌గా.. సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేలా ఉంది.

ర‌వితేజ మూడు గెట‌ప్స్ ట్రెండింగ్ లో ఉంటూ.. ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అందులో మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించారు ర‌వితేజ‌. ఈ చిత్రం పూర్తిగా స‌రికొత్త క‌థ‌.. భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది.

ఈ సినిమాలో ల‌య‌, సునీల్,వెన్నెల కిషోర్,ర‌ఘు బాబు,త‌రుణ్ అరోరా,అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యుఎస్ లోని అంద‌మైన లొకేష‌న్స్ లో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

న‌టీన‌టులు: ర‌వితేజ‌, ఇలియానా డీ క్రూజ్, సునీల్, ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌విప్ర‌కాశ్, త‌రుణ్ అరోరా, ఆదిత్య మీన‌న్, అభిమ‌న్యు సింగ్, విక్ర‌మ్ జిత్, రాజ్ వీర్ సింగ్, శియాజీ షిండే, శుభ‌లేక సుధాక‌ర్ త‌దిత‌రులు..

More News

'నువ్వెందుకు నచ్చావె శైలజ' చిత్రం ప్రారంభం

అనుపమ ఆర్ట్స్ పతాకం పై నాగేశ్వరరావు దర్శకత్వంలో వి.రామకృష్ణ నిర్మిస్తొన్న చిత్రం "నువ్వెందుకు నచ్చావె శైలజ". రోషన్, అనూష జంటగా నటిస్తున్నారు.

ఘంట‌శాల బ‌యోపిక్

అల‌నాటి మేటి గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు ఘంట‌శాల వెంక‌టేశ్వ‌ర‌రావు గురించి నేటి తరం యూత్ చాలా మంది వినే ఉంటారు.

రామ్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్‌...

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం 'హ‌లో గురు ప్రేమ కోస‌మే' సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్నారు.

ఎట్ట‌కేల‌కు ఆమె బ‌యోపిక్ స్టార్ట‌య్యింది

బ్యాడ్మింట‌ర్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ షూటింగ్  ఎట్ట‌కేల‌కు నేడు ముంబైలో ప్రారంభ‌మైంది.

జాతీయ క్రీడ‌కు రెహ్మాన్‌, గుల్జార్ ...

ఇండియా జాతీయ క్రీడ హాకీ.. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ఒరిస్సా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లో హాకీ వ‌రల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది.