ట్విట్టర్ వేదికగా అంబటి వర్సెస్ జనసేన వార్..

ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి జనసేన కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో వార్ నడుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అంబటి చేసిన ఓ ట్వీట్ ఇంత రచ్చకు కారణమైంది. జనసైనికులు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయి అంబటిని వరుస కామెంట్లతో ఉక్కిరి బిక్కిర చేస్తున్నారు. దీంతో అంబటి డిఫెన్స్‌లో పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఆగకుండా మరో ట్వీట్ పెట్టడంతో ఇంక అగ్గిలో మరింత ఆజ్యం పోసినట్టైంది.

ముందుగా అంబటి రాంబాబు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిపక్ష నేతల ‘‘స్వాతంత్ర దినోత్సవ వేడుకలను స్వరాష్ట్రంలో జరుపుకోలేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందంటారా ?’’ అని ట్వీట్ చేశారు. ఇక అంతే 2015లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హైదరాబాద్‌లో జెండా ఎగురవేసిన ఫోటోలను పోస్ట్ చేసి మరీ ఓ రేంజ్‌లో ఎదురుదాడికి దిగారు. ‘చుట్టం లాగా నియోజకవర్గానికి వచ్చిపోయే మీకు సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై పోరాటం చేసే ఐడియాలజీ ఉందా?’ అని ఒకరు.. ‘స్వతంత్ర దినోత్సవం అనేది దేశానికి సంబంధించినది. దేశం లో ఎక్కడ ఉన్నా పరదేశం లో ఉన్న జరుపు కోవచ్చు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఎమ్మెల్యే ఎలా అయ్యారు అంబటి గారు? ఊరికే ఎవరొకరి మీద పడిపోవడం తప్ప’ అని మరొకరు ఇలా కామెంట్లతో అంబటిని టార్గెట్ చేశారు.

అయినా అంబటి తగ్గలేదు.. ‘‘నా ట్వీట్‌కి జనసైనికులు భారిగా స్పందించారు. గౌరవంగా, లాజిక్‌తో కూడిన స్పందన చాలా తక్కువ మందిలో చూశాను. అసహనం, అసభ్య పదజాలంతో స్పందించిన వారి సంఖ్యే చాలా ఎక్కువ ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నంతకాలం, జనసేనను భగవంతుడే కాపాడలి!’’ అని మరో ట్వీట్ చేశారు. దీంతో జనసేన కార్యకర్తల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ‘అసెంబ్లీలో, శాసన సభలో అసభ్య పదజాలంతో తిట్టుకునే మీ ఇరు పార్టీ నాయకుల కంటే బెటరే సార్ మా వాళ్ళు. అయినా లాజిక్‌తో కూడిన ట్వీట్స్ వేసామని మీరే ఒప్పుకున్నారు అంటే మీ ఆలోచనతో వేసిన ట్వీట్ చెత్త ట్వీట్ అని ఒప్పుకున్నట్టేగా!’ అని ఒకరు.. ‘మేము మీ కార్యకర్తలు లాగా హైకోర్టును అసభ్య పదజాలంతో దూషించి చివరికి కోర్టుచే నోటీసులు పొందలేదు రాంబాబు గారూ!’ అని మరొకరు పోస్టులు పెట్టడమే కాకుండా.. గతంలో అసెంబ్లీలో వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

More News

సంచలనం సృష్టించిన నోవాటెల్ ఘటనలో నిందితుడి అరెస్ట్

విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర జరిగిన దారుణం జరిగింది. కారులో ముగ్గురు ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు.

నిత్యానంద సంచలన నిర్ణయం.. ముహూర్తం కూడా ఫిక్స్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తలకెక్కారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్ట్ 22న ఆయన ఓ సంచలనానికి శ్రీకారం చుట్టనున్నారు.

ప్ర‌భాస్ 22వ చిత్రం ప్ర‌క‌ట‌న‌.... పౌరాణిక‌మా!!

బాహుబ‌లి త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా ప్ర‌భాస్ వ‌రుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాహో విడుద‌ల త‌ర్వాత రాధేశ్యామ్ సెట్స్‌పై ఉంది.

ముగ్గురిలో ప‌వ‌న్ ఎవ‌రికి ఓటేస్తాడో..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత స్పీడు పెంచాడే కానీ.. త‌గ్గించ‌లేదు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్‌తో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల్సి ఉంది.

క‌థ చెప్ప‌డానికి అంత ఖ‌ర్చా!!

సినిమా క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌డానికి నిర్మాత డ‌బ్బులు ఖ‌ర్చు పెడుతుంటారు. స్టార్ హీరోల సినిమాల‌కైతే ఈ లెక్క పెద్ద‌దిగానే ఉంటుంది.