'అమీర్ పేట్ టు అమెరికా' పోస్టర్ లాంచ్ చేసిన మేయర్

  • IndiaGlitz, [Friday,January 05 2018]

రాధా మీడియా బ్యానర్ పై శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పించు ఎ టు ఎ, 'అమీర్ పేట్ టు అమెరికా' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ని నగర ప్రధమ పౌరుడు ,హైదరాబాద్ మేయర్ శ్రీ బొంతు రామ్‌మోహన్, డిప్యూటి మేయర్ శ్రీ బాబా ఫసివుద్దీన్ కలిసి శుక్రవారం రిలీజ్ చేసారు.

చిత్రానికి కర్త, కర్మ, క్రియ గా వున్న రామ్ మోహన్ కొమండూరి 'ఏ టు ఏ' చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని వినూత్నంగా డిజైన్ చేసారు. తెలంగాణాకి రారాజు సి.ఎం. కెసిఆర్ ఐతే అమెరికా కి రారాజు డోనాల్డ్ ట్రంప్. ఇటు తెలంగాణా నుండి అమెరికా కి ఎగురుతున్న విమానం తో కాన్సెప్ట్ ని సూటిగా చెప్తున్న కొత్త తరహా పోస్టర్ అని పలువురు ప్రశంసించారు.

బ్రహ్మానందం,మణిచందన, సమ్మెట గాంధీ, రజని, వేణుగోపాల్, వేణుమాధవ్, వారిజ, తేజస్, పల్లవి దొర, వంశీ కోడూరి, మేఘనా లోకేష్, వంశీ కృష్ణ, సాషా సింగ్, వైవా హర్ష,ప్రధానపాత్ర లుగా, అమెరికా నుండి కొందరు, ఇండియా నుండి కొందరు నటించిన చిత్రం 'అమీర్ పేట్ టు అమెరికా'. ఇటీవలనే చిత్రంలోని పాటను ఫ్లాష్ మాబ్ ద్వారా వినూత్నంగా విడుదల చేసారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది.

More News

గోపీచంద్ మూవీ కొత్త టైటిల్ ఏంటంటే?

గోపీచంద్ హీరోగా రూపొందుతున్న అతని 25వ చిత్రం చిత్రీకరణ దశలోఉంది.

మార్చి నుంచి నాని కొత్త చిత్రం

గత రెండు సంవత్సరాలుగా ఏడాదికో హ్యాట్రిక్ అన్నట్లుగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని.

'జై సింహా' .. సెకండాఫ్ హైలైట్ అట

బాలకృష్ణ,నయనతార హీరోహీరోయిన్లుగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘జై సింహా’.

పవన్.. ఒకరు కాదు ఇద్దరు

ఫస్ట్ లుక్,టీజర్,సాంగ్స్..ఇలా ప్రతి అంశంతోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్,

నలుగురు టాప్ హీరోలతో కీర్తి ధమాకా

కేరళ కుట్టి కీర్తి సురేష్..అనతి కాలంలోనే తెలుగు,తమిళ్ ఇండస్ట్రీలలో టాప్ కథానాయికలలో