అవసరాల - అడివి శేష్ లు హీరోలుగా ఇంద్రగంటి మల్టీస్టారర్ కు 'అమీ తుమీ' టైటిల్ ఫిక్స్

  • IndiaGlitz, [Sunday,March 12 2017]

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రానికి "అమీ తుమీ" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను నేడు ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన వేడుకలో చిత్ర బృందం సమక్షంలో విడుదల చేసారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. "ఈనెల 23వ తేదీతో టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న "అమీ తుమీ" తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుంది. అవసరాల-అడివి శేష్ ల మధ్య సన్నివేశాలు టైటిల్ కు తగ్గట్లుగా ఉంటాయి. ఈషా, అదితి మ్యాకల్ పాత్రలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేసి ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం. అందరూ తెలుగు ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు.

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!

More News

అల్లరి నరేష్ తాజా చిత్రం 'మేడ మీద అబ్బాయి' ప్రారంభం!

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది.

'శరణం గచ్చామి' ఆడియో విడుదల

బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తూ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన చిత్రం 'శరణం గచ్చామి'.

'కాటమరాయుడు' చిత్రంలో' జివ్వు జివ్వు..' సాంగ్ రిలీజ్ చేసిన అనూప్

పవర్ స్టార్ పవన్కళ్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మాతగా

17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'మెట్రో'

ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'ప్రేమిస్తే','జర్నీ',`పిజ్జా`వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -`మెట్రో`.

గురువు ని డైరెక్ట్ చేయనున్న శిష్యుడు

రణం వంటి హిట్ చిత్రం ద్వారా దర్శకునిగా తన ప్రతిభ ను చాటుకున్న దర్శకుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వం లో