ప్రభాస్ కోసం అమితాబ్ .. రాధేశ్యామ్ కోసం గొంతు సవరించిన బిగ్‌బి

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' హిందీ వెర్షన్కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్బీకి కృతజ్ఞతలు తెలిపింది చిత్రయూనిట్. ఈ మూవీని 250 కోట్ల పైగా బడ్జెట్‌తో నిర్మించారు. ప్రస్తుతం అమితాబ్, ప్రభాస్ కలిసి 'ప్రాజెక్టు-కె'లో కలిసి నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌‌గా నటిస్తుంది. దీనితో పాటు ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

డార్లింగ్ ప్రభాస్ ఎక్కడా సినిమా చేసినా తన వంటమనిషితో వండించుకుని తినడం అలవాటు. తనే కాకుండా కోస్టార్స్కు కూడా ఇంటి భోజనాన్ని రుచిచూపిస్తాడు. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్కు తెలుగు రుచులను పంపాడు. కొద్దిరోజుల క్రితం బిగ్‌బి అమితాబ్‌కు కూడా ప్రభాస్ ఆతిథ్యం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ వేదికగా అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు.. ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయని అమితాబ్ ట్వీట్ చేశారు.

పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా ‘రాధే శ్యామ్’ సినిమాను రూపొందించారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ సినిమాను నిర్మించగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇందులో విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర పోషించారు ప్ర‌భాస్.

More News

అంటే సుందరానికి: నాని పుట్టినరోజు స్పెషల్..  రేపు ‘‘బర్త్ డే హోమం’’

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేకుండా వున్న నేచురల్ స్టార్ నానీ  ‘‘శ్యామ్ సింగరాయ్’’ విజయంతో మంచి జోష్‌లో వున్నారు.

భీమ్లా నాయక్ ఎఫెక్ట్ : మరోసారి వాయిదాపడ్డ వరుణ్ తేజ్ ‘‘గని’’ .. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్‌పై వ్యాఖ్యలు.. ఆ వాయిస్ నాది కాదు: ఆడియో టేప్‌ వివాదంపై బండ్ల గణేశ్  క్లారిటీ

నిర్మాత, సినీనటుడు బండ్ల గణేశ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్

సమంతా నువ్వు ప్రెగ్నెంటా.. లేకపోతే నన్ను చేయమంటావా..!!

అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో వుండేందుకు గాను సినీ తారలు సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తున్నారు.

‘‘ నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలికి వస్తే కష్టం’’ : భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసిందిగా

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది.