అభిమానులారా.. నా ఇంటికి రాకండి : బిగ్‌బీ

కరోనా వైరస్ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం వచ్చేసింది. మరోవైపు ఢిల్లీలో కూడా ఈ వైరస్‌ ఒకరిద్దరికి సోకినట్లు వైద్యులు నిర్దారణకు వచ్చారు. ఇలాంటి వార్తలు విన్న జనాలు గజ గజ వణికిపోతున్నారు. అయితే ఈ క్రమంలో సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు, ఫంక్షన్స్‌ను నటీనటులు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నానని.. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

జాగ్రత్తగా ఉండండి..

అయితే.. తాజాగా బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ కీలక ప్రకటన చేశారు. అభిమానుల కోసం అమితాబ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆదివారం తన ఇంటికి వచ్చే అభిమానులతో ముచ్చటించడం.. ఆప్యాయంగా పలకరించడం ఆయనకు ఆది నుంచి అలవాటే. అయితే కరోనా నేపథ్యంలో అభిమానులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరిన ఆయన.. తనను కలవాడానికి కూడా రావొద్దని సూచించారు.

అర్థం చేస్కోండి..!

‘నన్ను కలిసేందుకు జల్సా గేట్ వద్దకు అభిమానులు ఎవరూ రావొద్దు. నేను అక్కడికి రావట్లేదు. ఈ విషయాన్ని నా అభిమానులు, శ్రేయోభిలాషులు అర్థం చేసుకోవాలి. మీరంతా తగు జాగ్రత్తలు తీసుకుని.. అప్రమత్తంగా ఉండాలి’ అని ట్విట్టర్ వేదికగా అమితాబ్ తెలిపారు.

More News

అలియా భట్‌కు ‘RRR’ యూనిట్ స్పెషల్ బర్త్‌డే విషెస్

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న

కరోనా ఎఫెక్ట్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్ : కేసీఆర్ ప్రకటనాంతరం చిరు కీలక నిర్ణయం

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా ‘ఒరేయ్‌ బుజ్జిగా'... రాజ్ తరుణ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో

చిరు-త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. పిచ్చ కామెడీ..!

‘అల వైకుంఠపురములో..’ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రేంజ్ మారిపోయింది.