బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌..

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అమితాబ్ స్వయంగా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హాస్పటిల్‌లో జాయిన్ అయ్యారు. వైద్యుల సూచన మేరకు.. నా కుటుంబం, స్టాఫ్ అంతా టెస్టులు చేయించుకున్నారు. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాం. గత పది రోజులుగా నన్ను కలిసిన వారందరూ దయచేసి టెస్టులు చేయించుకోండి’’ అని అమితాబ్ కోరారు.

వైద్యులేమంటున్నారంటే...

కాగా అమితాబ్ ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిల‌క‌డ‌గా ఉందని, భ‌య‌ప‌డాల్సింది ఏమీ లేద‌న్నారు. అయితే బిగ్‌బికి కాలేయ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు సైతం ఉన్నాయి. దీంతోనే ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయి చికిత్స పొందుతున్నారు. కాగా అమితాబ్ ప్రతి వారాంతంలో అభిమానులను కలుస్తుంటారు. ఇటీవల కాలంలో కరోనా కారణంగా ఆయన వాటిని కూడా విరమించుకున్నారు.

More News

ఏపీలో భయాందోళన రేకెత్తిస్తున్న కరోనా కేసులు..

ఏపీలో కరోనా కేసులు భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

విశ్వ‌క్ సేన్‌కు క్రేజీ ఆఫ‌ర్‌

‘వెళ్లిపోమాకే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విశ్వ‌క్‌సేన్‌కు ‘ఈన‌గ‌రానికి ఏమైంది’ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

ప్రగతి భవన్‌‌కు కేసీఆర్.. అన్ని విమర్శలకూ చెక్..

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వచ్చారు. కాగా.. సీఎం కేసీఆర్ ఎక్కడా..

ఇంత నిర్లక్ష్యమా? ఇది మీకు తగునా?

కరోనా మృతదేహాన్ని అత్యంత జాగ్రత్తగా తరలించాలి. నిబంధనల ప్రకారమైతే తరలించే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి..

దిల్‌రాజు అడుగు అక్క‌డ కూడా!!

తెలుగు చిత్ర నిర్మాత‌ల్లో దిల్‌రాజుకు ఓ ప్ర‌త్యేక‌స్థానం ఉంది. ఆయ‌న అగ్ర హీరోల‌తో పాటు కొత్త కంటెంట్ సినిమాల‌ను కూడా చేయ‌డంలో ఆస‌క్తి చూపిస్తుంటారు.