ఆర్జీవీ 'అమ్మరాజ్యం..' రిలీజ్కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం రిలీజ్కు సెన్సార్ బోర్డు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్ని రోజులు వివాదాల మధ్య నడిచిన ఈ సినిమాకు అడ్డు తొలిగింది. శనివారం సాయంత్రం రివైజింగ్ కమిటీ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 9 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ సినిమాని చూసి కొన్ని కట్స్ తో సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో దీంతో సినిమాను డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి ఆర్జీవీ ఫిక్సయ్యారు. అయితే సినిమా అసలు రిలీజ్ అవుతుందా..? లేదా..? అనేదానిపై అటు ఆర్జీవీ అభిమానులు, పలువురు ఔత్సాహికులు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. అయితే అటు పిటిషనర్, ఇటు సెన్సార్ బోర్డుతో పోరాడిన ఆర్జీవీ ఎట్టకేలకు సినిమా సర్టిఫికెట్ సంపాదించుకున్నాడు. సో.. ఇక థియేటర్లలో రచ్చరచ్చే మరి.
సినిమా రిలీజ్ కాకమునుపే ఇన్ని వివాదాల్లో ఇరుకున్న ఈ ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’.. థియేటర్లలోకి వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో..? ఎన్నెన్ని గొడవలు జరుగుతాయో..? ఏంటో మరి. కాగా.. మొదట ఈ సినిమాకు వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ పెట్టగా.. రాజకీయ సెగ తగలడంతో ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’గా టైటిల్ మార్చిన విషయం విదితమే.
ఆర్జీవీ రియాక్షన్ ఇదీ..
‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్. డిసెంబర్ 12న గ్రాండ్గా విడుదల కాబోతోంది. సారీ సారీ.. అలవాటులో పొరపాటు. ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నాం’ అని ట్వీట్లో రాసుకొచ్చాడు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.