ఆర్జీవీ 'అమ్మరాజ్యం..' రిలీజ్‌కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్

  • IndiaGlitz, [Saturday,December 07 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం రిలీజ్‌కు సెన్సార్ బోర్డు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్ని రోజులు వివాదాల మధ్య నడిచిన ఈ సినిమాకు అడ్డు తొలిగింది. శనివారం సాయంత్రం రివైజింగ్ కమిటీ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 9 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ సినిమాని చూసి కొన్ని కట్స్ తో సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో దీంతో సినిమాను డిసెంబర్‌ 12న రిలీజ్ చేయడానికి ఆర్జీవీ ఫిక్సయ్యారు. అయితే సినిమా అసలు రిలీజ్ అవుతుందా..? లేదా..? అనేదానిపై అటు ఆర్జీవీ అభిమానులు, పలువురు ఔత్సాహికులు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. అయితే అటు పిటిషనర్, ఇటు సెన్సార్ బోర్డుతో పోరాడిన ఆర్జీవీ ఎట్టకేలకు సినిమా సర్టిఫికెట్ సంపాదించుకున్నాడు. సో.. ఇక థియేటర్లలో రచ్చరచ్చే మరి.

సినిమా రిలీజ్ కాకమునుపే ఇన్ని వివాదాల్లో ఇరుకున్న ఈ ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’.. థియేటర్లలోకి వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో..? ఎన్నెన్ని గొడవలు జరుగుతాయో..? ఏంటో మరి. కాగా.. మొదట ఈ సినిమాకు వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ పెట్టగా.. రాజకీయ సెగ తగలడంతో ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’గా టైటిల్ మార్చిన విషయం విదితమే.

ఆర్జీవీ రియాక్షన్ ఇదీ..

‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్. డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సారీ సారీ.. అలవాటులో పొరపాటు. ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నాం’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు

More News

'మత్తు వదలరా' టీజర్‌ను విడుదల చేసిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్!

కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు.

'మేరా దోస్త్‌' సక్సెస్ మీట్

పవన్‌, శైలజ  జంటగా వి.ఆర్‌ ఇంటర్నేషనల్‌ పతాకం పై  పి .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్‌ లో రూపొందిన చిత్రం ‘మేరా దోస్త్‌’.

బాల‌య్య ప‌క్క‌న కీర్తీ!

తొలి సినిమా నేనూ శైల‌జ‌, ఆ త‌ర్వాత మ‌హాన‌టి.... ఇప్పుడు చేతిలో మ‌రికొన్ని సినిమాలు ఫుల్ స్వింగ్ మీదుంది కీర్తి పేరు.

మెగా కాంపౌండ్‌లో నందిని

మెగా కాంపౌండ్ ఇప్పుడు ప‌ర్ఫెక్ట్ యూనివ‌ర్శిటీలాగా క‌నిపిస్తోంది మేక‌ర్స్ కి. అక్క‌డ ఫ్రెష‌ర్స్ ఉంటారు.

సోలో... సో బెట‌ర్ అంటున్న ప‌ల్ల‌వి

సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు సోలో బ‌తుకే సో బెట‌ర్ అని అంటోందా? య‌స్‌... సాయిప‌ల్ల‌వి ఇప్పుడు అదే రాగాన్ని అందుకుంది.