close
Choose your channels

‘అమ్మరాజ్యం..’కు లైన్ క్లియర్.. రేపే రిలీజ్

Wednesday, December 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘అమ్మరాజ్యం..’కు లైన్ క్లియర్.. రేపే రిలీజ్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కు నోచుకుంది. బుధవారం సాయంత్రం సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం, బుధవారం రెండ్రోజులూ వరుసగా విచారించిన హైకోర్టు రిలీజ్‌ను ఆపేయాలని ఆదేశించగా బ్రేక్‌లు పడింది. ఆ తర్వాత కొన్ని సీన్స్‌ కట్ చేసిన అనంతరం సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో రేపు అనగా డిసెంబర్-12న రిలీజ్ చేయడానికి చిత్రబృందానికి మార్గం సుగుమమైంది.

పదేపదే అటు హైకోర్టు.. ఇటు సెన్సార్ బోర్డు అడ్డు తగలడం.. ఆర్జీవీ కొన్ని కొన్ని సన్నివేశాలు తీసివేయకపోవడం ఇలాంటి వరుస ఘటనలతో జాప్యం జరిగింది. ఫైనల్‌గా బుధవారం సాయంత్రం సెన్సార్ బోర్డు సభ్యురాలు, సీనియర్ నటి జీవిత రాజశేఖర్ చేతులు మీదుగా నిర్మాత నట్టి కుమార్‌తో పాటు చిత్రబృందం సర్టిఫికెట్‌ను దక్కించుకుంది. సో.. రేపు సినిమా చూడటానికి టికెట్లు బుక్ చేసుకున్న ఆర్జీవీ అభిమానులు, ఔత్సాహికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.