‘అమ్మరాజ్యం..’కు లైన్ క్లియర్.. రేపే రిలీజ్

  • IndiaGlitz, [Wednesday,December 11 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కు నోచుకుంది. బుధవారం సాయంత్రం సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం, బుధవారం రెండ్రోజులూ వరుసగా విచారించిన హైకోర్టు రిలీజ్‌ను ఆపేయాలని ఆదేశించగా బ్రేక్‌లు పడింది. ఆ తర్వాత కొన్ని సీన్స్‌ కట్ చేసిన అనంతరం సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో రేపు అనగా డిసెంబర్-12న రిలీజ్ చేయడానికి చిత్రబృందానికి మార్గం సుగుమమైంది.

పదేపదే అటు హైకోర్టు.. ఇటు సెన్సార్ బోర్డు అడ్డు తగలడం.. ఆర్జీవీ కొన్ని కొన్ని సన్నివేశాలు తీసివేయకపోవడం ఇలాంటి వరుస ఘటనలతో జాప్యం జరిగింది. ఫైనల్‌గా బుధవారం సాయంత్రం సెన్సార్ బోర్డు సభ్యురాలు, సీనియర్ నటి జీవిత రాజశేఖర్ చేతులు మీదుగా నిర్మాత నట్టి కుమార్‌తో పాటు చిత్రబృందం సర్టిఫికెట్‌ను దక్కించుకుంది. సో.. రేపు సినిమా చూడటానికి టికెట్లు బుక్ చేసుకున్న ఆర్జీవీ అభిమానులు, ఔత్సాహికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More News

‘వెంకీమామ’లో ట్విస్ట్ చెప్పిన చైతూ

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య.. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ నటీనటులుగా బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ’.

జగన్ సర్కార్‌ కొత్త బిల్లు: రేప్ చేస్తే మరణ శిక్షే..

మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని హోం మంత్రి మొదలుకుని..

'వీరశాస్త అయ్యప్ప కటాక్షం'కు ఇది తొలి విజయం!! 

100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ పతాకంపై రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకతంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త  వి.ఎస్.పి.తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న

ఊల్లాల ఊల్లాల చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన - కేటీఆర్

నటరాజ్, నూరిన్, అంకిత హీరో-హీరోయిన్లు గా రూపొందుతున్న చిత్రం "ఊల్లాల  ఊల్లాల". సీనియర్ నటుడు 'సత్య ప్రకాష్"

‘లోకేశ్‌ను చూస్తే వణకు.. బాలయ్యకు బాబు అన్యాయం’

వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా ఎలాంటి వారిపై అయినా విమర్శలు గుప్పించడంలో ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే.