'అమ్మాయి ప్రేమలో పడితే' ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,April 27 2017]

హర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం 'అమ్మాయి ప్రేమలో పడితే'. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎల్‌.దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వడం తో ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది.
ఈ సందర్బంగా దర్శకుడు మణి మాట్లాడుతూ నాకు ఇది రెండవ సినిమా.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హర్ష కు ప్రత్యేక కృతఙ్ఞతలు.
ఒక జంట ప్రేమలో ఉంటే ఎలా ఉంటారు ప్రేమలో లేకపోతే ఎలా ఉంటారు అనే ట్రూ లవ్ పైన ఈ చిత్ర కాన్సెప్ట్. మంచి కథ మరియు మంచి మ్యూజిక్ తో ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యం తో సినిమాను చేస్తున్నాం. మే లో అరకు ప్రాంతాలల్లో షూటింగ్ ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఈ చిత్రం లో 5 పాటలుంటాయి. తప్పకుండా సంగీతం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం తో ఉన్నానంటూ ఈ చిత్ర సంగీత దర్శకుడు భాను ప్రసాద్ తెలిపారు.
ఇక ఈ చిత్ర కెమెరామెన్ ఫణి మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడు మణి కు నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా లో విసువల్ పరంగా చాలా అద్భుతంగా తెరకెక్కించాలని అనుకుంటున్నా.. అది ఈ సినిమా కు ప్లస్ అవుతుందని భావిస్తున్నా అని చెప్పారు. ఇంకా ఈ ప్రారంభిత్సవం లో హీరోయిన్ షాను తో పాటు నిర్మాత హర్షవర్ధన్, శ్రీనివాసరెడ్డి లు పాల్గొని అభినందనలు మరియు అభిప్రాయాలను తెలియ చేసారు.
ఈ చిత్రానికి హీరో మణి, హీరోయిన్ షాను, సంగీతదర్శకుడు భానుప్రసాద్, రైటర్ బండోజి, కెమరామెన్ ఫణి, కారియోగ్రఫర్ సూర్య, నిర్మాతలు హర్షవర్ధన్ మరియు రమేష్ బి. దర్శకుడు మణి.

More News

వినోద్ ఖన్నాకన్నుమూత...

సీనియర్ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు.

ఐదేళ్ళ సమయం పడుతుందని తెలుసుంటే 'బాహుబలి' మొదలు పెట్టే వాళ్లమే కాదు - ఎస్.ఎస్.రాజమౌళి

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై ప్రభాస్,అనుష్క,తమన్నా,రానా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'బాహుబలి 2'.

'బాబు బాగా బిజీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం 'బాబు బాగా బిజీ'.

'సలామ్ జిందగీ' ట్రైలర్ విడుదల

టాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్ తరహాలో వరుస చిత్రాలు రూపొందిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకొంటున్న మరో చిత్ర పరిశ్రమ 'డెక్కన్ వుడ్'.

ఇలాంటి వ్యక్తి ఒక్కరుంటే చాలు దేశానికి ఎంతో మేలు: మంత్రి తలసాని

కళాతపస్వి కె.విశ్వనాథ్ ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డు వరిడంచడంతో యావత్త్ టాలీవుడ్ ఇండస్ర్టీ అంతా అభినందనల