'అమ్మాయిలంతే..అదో టైపు' పస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Saturday,September 23 2017]

మ‌న సంస్కృతికి మారు పేరుగా నిలిచిన స్త్రీలోని ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను మా 'అమ్మాయిలంతే ..అదోటైపు' సినిమాలో చూపిస్తున్నాం అంటున్నారు ద‌ర్శ‌కుడు కృష్ణ‌మ్‌. గోపి వర్మ, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా గాయ‌త్రి రీల్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ‌మ్ డైరెక్ట‌ర్‌గా రూపొందుతోన్న చిత్రం 'అమ్మాయిలంతే..అదోటైపు'. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది.

భావోద్వేగాలే హైలెట్ గా తెరకెక్కిన ప్రేమ క‌థా చిత్రమిది. డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, తన తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల, తండ్రి ప్రేమ‌కు దూర‌మ‌వుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, తండ్రి ప్రేమకి దూరమయ్యాననే కూతురు పడే బాధ, ఆ తరువాత జరిగే పర్యవసానల మధ్య సాగే ఎమోష‌నల్ క‌థ‌. న‌టీనటులు, టెక్నిషియ‌న్స్ స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగాం. ఇప్పుడు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేస్తున్నాం. మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుదిరింది. త్వరలోనే ఆడియోవిడుద‌ల చేసి, అక్టొబర్ లొ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.

గోపి వర్మ‌, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా, సాయి, భ‌ద్ర‌మ్‌, వేణుగోపాల్‌, భ‌ర‌త్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఎడిట‌ర్ః గోపీ సిందం, సినిమాటోగ్ర‌ఫీః శ్రీనివాస్‌, సాహిత్యంః పూర్ణాచారి, ద‌ర్శ‌కత్వంః కృష్ణ‌మ్.

More News

త్రీడీ టెక్నాల‌జీలో రోబో సీక్వెల్ '2.0'

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'. ఈ చిత్రాన్ని ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి

వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న అంజలి సోదరి.. ఆరాధ్య!

కథానాయికల చెల్లాయిలు..వెండి తెరపై అడుగుపెట్టడం,తమ సత్తా చాటుకోవడం చూస్తూనే ఉన్నాం.

ఎన్టీఆర్ సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం జైల‌వ‌కుశ మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. రెండు రోజుల్లో రూ.60 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఓవ‌ర్‌సీస్‌లో ఇప్ప‌టికే మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లోకి చేరింది. ఈ చిత్రంలోని జై పాత్ర‌లో తార‌క్ న‌ట విశ్వ‌రూపం చూపించాడు. 

నారా రోహిత్ 'బాలకృష్ణుడు' ఫస్ట్ లుక్ విడుదల

సరస్ చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్,మాయా బజార్ మూవీస్ పతాకాలపై విలక్షణ నటుడు నారా రోహిత్,

మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకున్న హార‌ర్ కామెడీ 'వ‌స్తా'

భానుచంద‌ర్‌, జీవా, అదిరే అది, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా మెట్రో క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందుతోన్న సినిమా 'వ‌స్తా'. జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌కుడు. ద‌మిశెల్లి రవికుమార్, మొహ్మ‌ద్ ఖ‌లీల్ నిర్మాత‌లు. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...