YCP:వైసీపీ అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట.. సామాజిక న్యాయం అంటే ఇదే..

  • IndiaGlitz, [Saturday,March 16 2024]

వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న వైసీపీ అందుకు తగ్గట్లే అభ్యర్థులను ఎంపిక చేసింది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించింది. 25 పార్లమెంట్ సీట్లలో ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11 సీట్లు, ఓసీలకు 9 సీట్లను సీఎం జగన్ కేటాయించారు. ఇక అసెంబ్లీ స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. 200 ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో 33 ఎస్సీలకు, ఎనిమిది ఎస్టీలకు, 59 బీసీలకు, 7 మైనార్టీలకు, ఓసీలకు 100 సీట్లు కేటాయించి చరిత్ర సృష్టించారు.

దేశంలోనే 50శాతంకు పైగా సీట్లు వెనకబడిన వర్గాలకు ఇవ్వడం ఇదే తొలిసారి. ముఖ్యంగా మహిళలకు, బీసీలకు ఈ జాబితాలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడంలో వైసీపీని మించిన పార్టీ మరొకటి లేదని నిరూపించారు. అలాగే 14 మంది పార్టీ కార్యకర్తలకు అసెంబ్లీ స్థానాలను కేటాయించి క్యాడర్‌కు అభయం కల్పించారు. 2019 లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయించగా.ఈ సారి ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా పెంచి 100 సీట్లు వారికి కేటాయించారు.

2019లో బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయించగా.. 2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వగా ఈసారి మరో 4 స్థానాలు పెంచి 19 స్థానాలు ఇచ్చారు. 2019లో ఐదుగురు మైనార్టీలకు ఇవ్వగా ఈసారి మరో రెండు సీట్లు పెంచి మొత్తం 7 స్థానాలు కేటాయించారరు. ఇక 2019లో మహిళలకు 2 ఎంపీ స్థానాలు ఇస్తే ఈసారి 3 స్థానాలు ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది గ్రాడ్యుయేట్లు, ఎంపీల్లో 88 శాతం మంది గ్రాడ్యుయేషన్ ఆపై చదువులు చదివిన వారు ఉన్నారు.

మరోవైపు కూటమి తరుఫున బరిలో దిగుతున్న కీలక నేతలకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ తనదైన వ్యూహాలు అమలు చేశారు. టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానాల్లో మహిళలను పోటీకి నిలబెట్టారు. బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీఎన్ దీపికను అభ్యర్థిగా ప్రకటించగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పోటీగా మంగళగిరిలో లావణ్యను బరిలో నిలిపారు. కీలక నేతలపై మహిళా అభ్యర్థులను బరిలో నిలపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

More News

RS Praveen Kumar :బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్‌లోకి..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షడు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Modi:కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో తెలంగాణ నలిగిపోతుంది.. ప్రధాని మోదీ విమర్శలు..

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణ నలిగిపోతుందని ప్రధాని మోదీ వాపోయారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు.

Venkatesh Daughter:కుటుంబసభ్యుల సమక్షంలో సింపుల్‌గా వెంకటేష్ చిన్న కుమార్తె వివాహం..

దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. విక్టరీ వెంకటేష్ చిన్న కుమార్తె వివాహం శుక్రవారం రాత్రి సింపుల్‌గా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.

Mudragada: కాపుల్లో చెరగని 'ముద్ర'గడ.. వైసీపీలో చేరికతో విపక్షాల్లో అలజడి..

దశాబ్దాలకు కాపులకు పెద్దగా వ్యవహరిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. ఇందుకోసం అప్పటి తెలుగుదేశం

Kavitha Arrest: బిగ్ బ్రేకింగ్: లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు.