కాబోయే భర్తతో అమీ జాక్సన్ బ్రేకప్.. అతడి ఫొటోలన్నీ డిలీట్!

  • IndiaGlitz, [Tuesday,July 27 2021]

అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ ఎవడు, 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో నటించిన 2.0 చిత్రమే అమీ జాక్సన్ చివరి చిత్రం.

ఆ తర్వాత జాక్సన్ మరే మూవీలోనూ నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో సహజీవనం మొదలు పెట్టడమే. లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీరిద్దరి సహజీవనం ప్రారంభించారు. 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు.

ఆ తర్వాత వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి అనే వార్తలు కూడా వచ్చాయి. ముద్దుల కొడుకు, కాబోయే భర్తతో అమీ లైఫ్ హ్యాపీగా గడిచిపోతోంది. కానీ ఊహించని విధంగా ఆమె పర్సనల్ లైఫ్ లో చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా అమీ జాక్సన్.. జార్జ్ తో బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అమీ జాసన్ తన సోషల్ మీడియాలో జార్జ్ ఫొటోలన్నింటిని తొలగించింది. జార్జ్ తన కొడుకుతో ఉన్న పిక్స్ కూడా అమీ డిలీట్ చేసింది.

తన బ్రేకప్ పై అమీ జాక్సన్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పెళ్లి కాకుండానే తల్లై వార్తల్లో నిలిచిన అమీ జాక్సన్..ఇప్పుడు బ్రేకప్ తో వార్తల్లో కెక్కింది.