'అనగనగా ఓ ప్రేమకథ' ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,November 25 2017]

కె. ఎల్.ఎన్ రాజు నిర్మాత‌గా.. థంజౌడ్ లైట్స్ మీడియా ప్రై.లి బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం 'అనగనగా ఓ ప్రేమకథ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా న‌వంబ‌ర్ 25న నిర్మాత‌ నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ వద్ద అసోసియేట్ గా పనిచేసిన టి.ప్రతాప్ ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి హీరో గా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్స్‌గా రిద్ధి కుమార్ మరియు రాధా బంగారు పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు గారు క్లాప్ కొట్టారు. సీనియర్ ఫైనాన్షియర్ సత్యరంగయ్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత కె.ఎల్.ఎన్. రాజు స్క్రిప్ట్‌ని దర్శకుడు ప్రతాప్‌కి అందజేశారు.

చిత్ర నిర్మాత కె ఎల్ ఎన్ రాజు మాట్లాడుతూ..''Thousand Lights Media అనే బ్యానర్ ని స్థాపించి ఈ సినిమా ధ్వారా నూతన హీరో హీరోయిన్ లను పరిచయం చేస్తున్నాం ., ప్రతాప్ గారు ఈ సినిమా ధ్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయంసాధించాలని ఆశిస్తున్నాను'' అని తెలిపారు.

దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ.. ''కె ఎల్ ఎన్ రాజు గారు బ్యానర్ స్థాపించి మొట్టమొదటి సినిమా నాకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది'' అన్నారు

హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ ''ఈ సినిమా ద్వారా హీరో గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.

నటుడు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ ''కథ చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ సినిమా తో అందరికి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నాయక,నాయికలుగా విరాజ్.జె.అశ్విన్., రిధి కుమార్, రాధా బంగారు పరిచయం అవుతుండగా. ఇతర ప్రధాన పాత్రలలో కాశీ విశ్వనాధ్,అనీష్ కురువిల్ల, వేణు తిళ్ళు నటిస్తున్నారు.

ఛాయాగ్రహణం; ఎదురొలు రాజు, సంగీత ; కృష్ణ చేతన్ టి.ఆర్. ఎడిటింగ్; మార్తాన్డ్ కె వెంకటేష్, పాటలు; శ్రీమణి, ఆర్ట్; రామాంజనేయులు, ఫైట్స్: రామకృష్ణ, నృత్యాలు: యస్వంత్, ప్రొడక్షన్ కంట్రోలర్ : బెక్కెం రవీందర్, నిర్మాత: కె.ఎల్.ఎన్. రాజు, దర్శకుడు : ప్రతాప్. టి.