అనకాపల్లి – అచ్యుతాపురం రోడ్డు విస్తరణ మొదలు


Send us your feedback to audioarticles@vaarta.com


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్ల స్థితిగతులు శరవేగంగా మారిపోతున్నాయి. ఎక్కడికక్కడ రహదారుల్ని అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14 కి.మీ.ల పొడవైన రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
యువగళం పాదయాత్ర సమయంలో ఈ ప్రాంత ప్రజలు రహదారి విస్తరణ చేపట్టాలని లోకేష్ కు విన్నవించారు. ఆనాడు లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని రూ.347 కోట్ల ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎడిబి) ఆర్థికసాయంతో 4 లైన్ల రహదారిగా విస్తరించనున్నారు.
రెండేళ్ల కాలవ్యవధిలో చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ తోపాటు రెండు మైనర్ బ్రిడ్జిలు, 47 కల్వర్టులు నిర్మిస్తారు. ఇది అందుబాటులోకి వస్తే.. విశాఖ-చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్, జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ, స్పెషల్ ఎకనమిక్ జోన్ కు రాకపోకలు మరింత వేగంగా, సౌకర్యంగా సాగుతాయి.
ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ రోడ్డు అనకాపల్లి సమీపంలోని NH-16 జంక్షన్ వద్ద ప్రారంభమై అచ్యుతాపురం వద్ద ముగుస్తుంది. ఈ రహదారి హరిపాలెం రోడ్డు, పూడిమడక రోడ్డు వెంబడి నివాసాలు, పారిశ్రామిక సంస్థలు, మత్స్యకార గ్రామాలకు ప్రధాన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రతిరోజూ లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగుల రోజువారీ రాకపోకలను సులభతరం చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com